ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి.ఉరవకొండ నియోజకవర్గంలోని చాయాపురంలో ఓ సభలో చంద్రబాబు పాల్గొన్నారు.అక్కడ మాట్లాడిన ఆయన, ప్రధాని మోదీ నాయకత్వం దేశానికి రక్షణ కవచం అన్నట్టు వ్యాఖ్యానించారు.దేశం ఒక రకమైన యుద్ధ వాతావరణంలో ఉందన్నారు చంద్రబాబు.పహల్గామ్ ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అమాయక ప్రజల్ని ఉగ్రవాదులు హత్యచేయడం క్షమించలేని చర్య అని తెలిపారు.భారతదేశం ఎప్పుడూ హింసకు వ్యతిరేకమేనని అన్నారు. ప్రధాని మోదీ కూడా ఈ విషయాన్ని పదేపదే చెబుతున్నారని గుర్తుచేశారు.పాకిస్థాన్ నిరంతరం దాడులకు పాల్పడుతోందని మండిపడ్డారు. సరిహద్దుల్లో మన సైనికులు అపారంగా త్యాగం చేస్తున్నారని కొనియాడారు.యువత సైన్యంలో చేరడం గర్వకారణమన్నారు.వీరి వల్లే మనం నిశ్చింతగా జీవించగలుగుతున్నామన్నారు.

తెలుగు బిడ్డ మురళీ నాయక్ మరణం తనను కలచివేసిందన్నారు.ఆయన తల్లిదండ్రులతో మాట్లాడిన విషయాన్ని తెలిపారు. వారికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మురళీ నాయక్ సేవలు చిరస్మరణీయమని కొనియాడారు.రాష్ట్ర ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. దేశ రక్షణలో ప్రతి ఒక్కరి బాధ్యత ఉందన్నారు. సైనికుల త్యాగం మనందరికీ ప్రేరణగా నిలవాలని అన్నారు. మనం సైనికుల సేవలను ఎప్పటికీ మర్చిపోవద్దన్నారు.సభ ముగింపులో చంద్రబాబు “భారత్ మాతాకీ జై” నినాదాలు చేశారు. మురళీ నాయక్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు. సభలో రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళి అర్పించారు.
Read Also : Andhra Pradesh: ఏపీకి 200 బస్సులురానున్నాయి