సీఎం చంద్రబాబు చీరాల పర్యటన రద్దు

సీఎం చంద్రబాబు చీరాల పర్యటన రద్దు అయింది. భారీ వర్షం కారణంగా ఆయన ఈ టూర్ను రద్దు చేసుకున్నారు. ఈరోజు సాయంత్రం బాపట్ల జిల్లా చీరాల మండలం వేటపాలెంలో నేతన్నలతో చంద్రబాబు ముఖాముఖి నిర్వహించాల్సి ఉంది. అలాగే నేతన్నలకు ప్రత్యేక ప్యాకేజీ కూడా ప్రకటిస్తారని వార్తలు వచ్చాయి. కాగా విజయవాడలో జరిగే చేనేత దినోత్సవంలో బాబు పాల్గొననున్నారు.

ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం.. హెలికాఫ్టర్ లో బయలుదేరి బాపట్ల జిల్లా వేటపాలెంకు వెళ్తారు. అక్కడి నుండి రోడ్డు మార్గంలో చీరాల జంద్రాపేటలో గల బీవి అండ్ బీఎన్ హైస్కూల్ ఆవరణకు మధ్యహ్నం 3 గంటలకు చేరుకుంటారు. అక్కడ జరిగే జాతీయ చేనేత దినోత్సవంలో సీఎం పాల్గొననున్నారు. చేనేత కార్మికుల గృహాలకు వెళతారు. అనంతరం వీవర్స్ సర్వీస్ సెంటర్ స్టాల్ సందర్శిస్తారు. స్థానిక చేనేత కార్మికులతో సీఎం చంద్రబాబు ముఖాముఖి సమావేశం అవుతారు. తర్వాత వారిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. తిరిగి ఆరు గంటలకు హెలికాఫ్టర్ లో ఉండవల్లికి చేరుకోవాలి. కానీ ఇప్పుడు వర్షం కారణంగా పర్యటన రద్దయింది.