Chandrababu డిజిటల్ పాలన కోసం చంద్రబాబు కీలక అడుగు ఏఐతో ముందడుగు

Chandrababu : డిజిటల్ పాలన కోసం చంద్రబాబు కీలక అడుగు: ఏఐతో ముందడుగు

ఆంధ్రప్రదేశ్ పాలనలో నూతన టెక్నాలజీల వినియోగానికి శ్రీకారం చుట్టారు సీఎం చంద్రబాబు. ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఫర్ గవర్నమెంట్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్’ అనే అంశంపై సచివాలయంలో ఓ ప్రత్యేక వర్క్‌షాప్‌ నిర్వహించారు. ఇందులో ప్రభుత్వ ఉన్నతాధికారులతో సీఎం పాల్గొని మార్గనిర్దేశనం చేశారు.ఈ వర్క్‌షాప్‌లో ముఖ్యంగా ఏఐ, డేటా డ్రివెన్ పాలన, కొత్త టెక్నాలజీల వినియోగంపై చర్చ సాగింది. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయివరకు టెక్నాలజీతో ప్రజా సేవల్లో ఎలా మార్పు తీసుకురావచ్చో నిపుణులు వివరించారు. ఈ సమావేశానికి సీఎస్, డీజీపీతో పాటు కేంద్ర ఐటీ శాఖ మాజీ కార్యదర్శి చంద్రశేఖర్, వాద్వాని సెంటర్ సీఈవో ప్రకాశ్ కుమార్, డబ్ల్యూజీడీటీ డీన్ కమల్ దాస్ లాంటి పలువురు నిపుణులు హాజరయ్యారు.వర్క్‌షాప్‌లో ప్రభుత్వం ప్రస్తుతం అనుసరిస్తున్న టెక్ పద్ధతులపై కూడా విశ్లేషణ జరిగింది. ఏ విభాగంలో ఏ టెక్నాలజీ ఫలితాలివ్వగలదన్న దానిపై వివరణాత్మకంగా చర్చ జరిగింది.

Advertisements
Chandrababu డిజిటల్ పాలన కోసం చంద్రబాబు కీలక అడుగు ఏఐతో ముందడుగు
Chandrababu డిజిటల్ పాలన కోసం చంద్రబాబు కీలక అడుగు ఏఐతో ముందడుగు

ముఖ్యంగా ఏఐ, ఎంఎల్, డీప్ లెర్నింగ్, చాట్‌జీపీటీ,వంటివి పాలనలో ఎలా ఉపయోగపడతాయన్నదానిపై ప్రత్యేక ఈ వర్క్‌షాప్‌ను రెండు విడతలుగా నిర్వహిస్తున్నారు. మొదటి రోజున అన్ని శాఖల కార్యదర్శులు పాల్గొంటుండగా, రెండోరోజు విభాగాధిపతులు హాజరవుతారు. వ్యవసాయం, వైద్య, విద్య, పట్టణాభివృద్ధి రంగాల్లో టెక్నాలజీ ప్రయోగాలపై కూడా విశ్లేషణ ఉంది. వినూత్నంగా పనిచేసే టెక్నాలజీ పైలట్ ప్రాజెక్టులు ఎలా అమలు చేయాలన్నదానిపై ముఖ్య దిశానిర్దేశం జరిగింది.చంద్రబాబు మాట్లాడుతూ, “పౌర సేవల్లో వేగం, పారదర్శకత పెరగాలంటే టెక్నాలజీ తప్పనిసరి. ప్రతి ఫలితం గణాంకాల ఆధారంగా ఉండాలి. ఇది ఉత్తమ పాలనకు కీలకం” అని అన్నారు. ఈ దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సమర్థవంతమైన పాలనకు బలమైన పునాది వంటివి.ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ వినియోగంలో దేశంలో ముందు వరుసలో ఉంది. ఈ వర్క్‌షాప్ ద్వారా ఆ దిశగా మరో ముందడుగు పడింది. పాలనలో ఏఐకి పెద్ద పీఠవేయడం ద్వారా ప్రభుత్వం ప్రజలతో మరింత సమీపానికి వస్తుందని స్పష్టమవుతోంది.

Read Also : Tirupati Police : తిరుపతిలో పోలీసుల డ్రోన్ నిఘా వ్యవస్థ పటిష్టం

Related Posts
Venkata Satyanarayana: వెంకటసత్యనారాయణ రాజ్యసభ అభ్యర్థిగా ఖరారు
Venkata Satyanarayana: వెంకటసత్యనారాయణ రాజ్యసభ అభ్యర్థిగా ఖరారు

ఆంధ్రప్రదేశ్‌లో రాజ్యసభ ఖాళీ అయిన స్థానానికి భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తరఫున పాక వెంకట సత్యనారాయణను అభ్యర్థిగా ప్రకటించింది. మాజీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత Read more

Rushikonda Palace : రుషికొండ ప్యాలెస్‌పై చంద్రబాబు ఫోకస్
CBN Rushikonda

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశాఖపట్నంలోని రుషికొండ భవనాల భవితవ్యంపై కీలకంగా ఆలోచిస్తోంది. వందల కోట్ల రూపాయల ప్రజాధనంతో నిర్మించిన ఈ భవనాలను ఎలా వినియోగించుకోవాలనే దానిపై సీఎం నారా Read more

Purandeshwari: వక్ఫ్ బోర్డును మహిళలకే ప్రాధాన్యత ఇచ్చాము: పురందేశ్వరి
వక్ఫ్ బోర్డులో మహిళలకు ప్రాధాన్యం కల్పించాం

ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి ఇటీవల వక్ఫ్ బిల్లుపై చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఆమె ప్రకటనలలో, పార్లమెంట్ ఉభయ సభల ఆమోదం పొందిన Read more

Andhra Pradesh: ఏపీలో కొత్త రైల్వే లైన్‌ ఎక్కడంటే?
Andhra Pradesh: ఏపీలో కొత్త రైల్వే లైన్‌ ఎక్కడంటే?

ఏపీలో రైలు, రోడ్ల ప్రాజెక్టుల పనుల్ని ప్రభుత్వం వేగవంతం చేసింది. తెలంగాణను, హైదరాబాద్‌ను కనెక్ట్ చేస్తూ చేపట్టిన నడికుడి - శ్రీకాళహస్తి కొత్త రైల్వే లైన్ పనులు Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×