ఆంధ్రప్రదేశ్ పాలనలో నూతన టెక్నాలజీల వినియోగానికి శ్రీకారం చుట్టారు సీఎం చంద్రబాబు. ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఫర్ గవర్నమెంట్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్’ అనే అంశంపై సచివాలయంలో ఓ ప్రత్యేక వర్క్షాప్ నిర్వహించారు. ఇందులో ప్రభుత్వ ఉన్నతాధికారులతో సీఎం పాల్గొని మార్గనిర్దేశనం చేశారు.ఈ వర్క్షాప్లో ముఖ్యంగా ఏఐ, డేటా డ్రివెన్ పాలన, కొత్త టెక్నాలజీల వినియోగంపై చర్చ సాగింది. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయివరకు టెక్నాలజీతో ప్రజా సేవల్లో ఎలా మార్పు తీసుకురావచ్చో నిపుణులు వివరించారు. ఈ సమావేశానికి సీఎస్, డీజీపీతో పాటు కేంద్ర ఐటీ శాఖ మాజీ కార్యదర్శి చంద్రశేఖర్, వాద్వాని సెంటర్ సీఈవో ప్రకాశ్ కుమార్, డబ్ల్యూజీడీటీ డీన్ కమల్ దాస్ లాంటి పలువురు నిపుణులు హాజరయ్యారు.వర్క్షాప్లో ప్రభుత్వం ప్రస్తుతం అనుసరిస్తున్న టెక్ పద్ధతులపై కూడా విశ్లేషణ జరిగింది. ఏ విభాగంలో ఏ టెక్నాలజీ ఫలితాలివ్వగలదన్న దానిపై వివరణాత్మకంగా చర్చ జరిగింది.

ముఖ్యంగా ఏఐ, ఎంఎల్, డీప్ లెర్నింగ్, చాట్జీపీటీ,వంటివి పాలనలో ఎలా ఉపయోగపడతాయన్నదానిపై ప్రత్యేక ఈ వర్క్షాప్ను రెండు విడతలుగా నిర్వహిస్తున్నారు. మొదటి రోజున అన్ని శాఖల కార్యదర్శులు పాల్గొంటుండగా, రెండోరోజు విభాగాధిపతులు హాజరవుతారు. వ్యవసాయం, వైద్య, విద్య, పట్టణాభివృద్ధి రంగాల్లో టెక్నాలజీ ప్రయోగాలపై కూడా విశ్లేషణ ఉంది. వినూత్నంగా పనిచేసే టెక్నాలజీ పైలట్ ప్రాజెక్టులు ఎలా అమలు చేయాలన్నదానిపై ముఖ్య దిశానిర్దేశం జరిగింది.చంద్రబాబు మాట్లాడుతూ, “పౌర సేవల్లో వేగం, పారదర్శకత పెరగాలంటే టెక్నాలజీ తప్పనిసరి. ప్రతి ఫలితం గణాంకాల ఆధారంగా ఉండాలి. ఇది ఉత్తమ పాలనకు కీలకం” అని అన్నారు. ఈ దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సమర్థవంతమైన పాలనకు బలమైన పునాది వంటివి.ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ వినియోగంలో దేశంలో ముందు వరుసలో ఉంది. ఈ వర్క్షాప్ ద్వారా ఆ దిశగా మరో ముందడుగు పడింది. పాలనలో ఏఐకి పెద్ద పీఠవేయడం ద్వారా ప్రభుత్వం ప్రజలతో మరింత సమీపానికి వస్తుందని స్పష్టమవుతోంది.
Read Also : Tirupati Police : తిరుపతిలో పోలీసుల డ్రోన్ నిఘా వ్యవస్థ పటిష్టం