తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక పరిణామానికి వేదికగా మారబోతుంది .అనంతపురం జిల్లాలో, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు జిల్లాలో పర్యటించనున్నారు. ఆయన ఉరవకొండ నియోజకవర్గ ప్రజలు ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా హంద్రీనీవా కాలువ విస్తరణ పనులపై ఆయన ప్రత్యేకంగా దృష్టి పెట్టనున్నారు.ఈ పర్యటన శుక్రవారం ఉదయం ప్రారంభం కానుంది. విజయవాడ విమానాశ్రయం నుంచి సీఎం చంద్రబాబు శ్రీసత్యసాయి జిల్లాలోని పుట్టపర్తి ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా అనంతపురం జిల్లాలోని వజ్రకరూరు మండలంలోని ఛాయాపురం చేరుకుంటారు.

హంద్రీనీవా కాలువ పనులపై ప్రత్యేక దృష్టి
ఈ పర్యటనలో ముఖ్యంగా హంద్రీనీవా కాలువ విస్తరణ, లైనింగ్ పనుల పరిశీలన ముఖ్య ఉద్దేశంగా ఉంది. నీటి వనరుల సమర్థ వినియోగం, సాగునీటి అవసరాల పరిష్కారంపై ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఈ కాలువ దశాబ్దాలుగా రైతులకు ఆధారంగా నిలుస్తోంది. అయితే మరమ్మతులు, విస్తరణ అవసరం ఉంది. ఈ నేపథ్యంతో సీఎం చంద్రబాబు ప్రత్యక్షంగా వచ్చి పనుల పురోగతిని గమనించనున్నారు.ఛాయాపురం వద్ద చంద్రబాబు స్థానిక ప్రజలతో ప్రత్యక్షంగా మాట్లాడనున్నాడు. వారి అభిప్రాయాలు, సమస్యలు తెలుసుకోనున్నారు. ఇది పాలనలో పారదర్శకతకు నిదర్శనంగా నిలుస్తుంది. ప్రజల పక్షాన ప్రభుత్వ విధానాలను అమలు చేయడంలో ఇది ముఖ్యమైన అడుగు.
జలవనరుల శాఖతో సమీక్షా సమావేశం
పరిశీలన అనంతరం, జలవనరుల శాఖ అధికారులతో సమావేశం ఉంటుంది. ప్రాజెక్టు పనులపై సమగ్ర సమాచారం తీసుకుంటారు. అవసరమైన మార్గదర్శకాలు ఇస్తారు. ఆ తర్వాత సీఎం చంద్రబాబు బెంగళూరుకు బయలుదేరుతారు.ఈ పర్యటన ద్వారా చంద్రబాబు ప్రభుత్వం అభివృద్ధిపై ఎటువంటి చేయదని మరోసారి నిరూపించనుంది. హంద్రీనీవా కాలువ ప్రాజెక్టు సాగు వ్యవసాయానికి ప్రాణనాళిక. దీనిపై చేపడుతున్న చర్యలు, ప్రభుత్వ నిబద్ధతను తెలియజేస్తాయి.
Read Also : AP High Court: ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో భారీ ఊరట