Chandrababu: అభివృద్ధి దిశగా ఏపీ ప్రభుత్వం మరో కీలక ఒప్పందం

Chandrababu: అభివృద్ధి దిశగా ఏపీ ప్రభుత్వం మరో కీలక ఒప్పందం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లేందుకు చురుగ్గా పనిచేస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బహుళ రంగాల్లో పెట్టుబడులు తీసుకొచ్చే లక్ష్యంతో ఎన్నో చారిత్రాత్మక ఒప్పందాలు కుదుర్చుకుంటోంది. తాజాగా, “క్రియేటివ్‌ల్యాండ్ ఆసియా” అనే ప్రముఖ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని ‘క్రియేటర్‌ల్యాండ్’ అనే ట్రాన్స్‌మీడియా ఎంటర్‌టైన్‌మెంట్ సిటీని అమరావతిలో స్థాపించేందుకు చర్యలు ప్రారంభించింది. అని చంద్ర‌బాబు నాయుడు ట్వీట్ చేశారు.

Advertisements

భారత్‌లోనే మొట్టమొదటి ట్రాన్స్‌మీడియా సిటీ

ఇది ఇండియాలోనే తొలి ట్రాన్స్‌మీడియా ఎంటర్‌టైన్‌మెంట్ సిటీ కావడం విశేషం. ట్రాన్స్‌మీడియా అంటే అనేక మీడియా ఫార్మాట్లను కలిపి వినూత్నమైన కథనాలను ప్రస్తావించే విధానం. ఇది చలనచిత్రం, వీడియో గేమింగ్, సంగీతం, వర్చువల్ రియాలిటీ, ఇమర్సివ్ న్యారేషన్, కృత్రిమ మేధ (AI) ఆధారిత కంటెంట్ వంటి విభాగాలను సమన్వయపరచనుంది. ఈ రంగాలన్నింటిని ఒకే చోట ఏకీకృతంగా అభివృద్ధి చేయడం ద్వారా తెలుగు యువతకు, స్థానిక ప్రతిభావంతులకు ప్రపంచ స్థాయి అవకాశాలు లభించనున్నాయి.

యువతకు నూతన అవకాశాలు

రాజధాని అమరావతిలో ప్రారంభించడానికి GOAP క్రియేటివ్‌ల్యాండ్ ఆసియాతో చారిత్రాత్మక అవగాహన ఒప్పందం కుదుర్చుకుందని ప్రకటించడానికి సంతోషంగా ఉంది. 25వేల ఉద్యోగాలను సృష్టించే లక్ష్యంతో ఈ ప్రాజెక్ట్ ఎఫ్‌డీఐని ఆకర్షించడానికి,పెద్ద ఎత్తున అభివృద్ధిని తీసుకురావడానికి, స్థానిక ప్రతిభను క్రియేట్ ఇన్ ఏపీ & క్రియేట్ ఫర్ ది వరల్డ్‌కు శక్తివంతం చేయడానికి సిద్ధంగా ఉంది. ప్రాజెక్టులో భాగంగా, “క్రియేటర్‌ల్యాండ్ అకాడమీ” కూడా ఏర్పాటు కానుంది. ఇది దేశీయ విద్యార్థులకు, సాంకేతిక నిపుణులకు సినిమా, డిజిటల్ ఆర్ట్స్, గేమింగ్, మరియు వర్చువల్ ప్రొడక్షన్ రంగాల్లో నైపుణ్యాలను పెంపొందించడానికి కేంద్రంగా పనిచేస్తుంది. ఈ అకాడమీ ద్వారా యువతకు సమగ్ర శిక్షణ, ఇంటర్నేషనల్ ప్రమాణాల ప్రకారం ఉపాధి అవకాశాలు కల్పించనుంది. అని సీఎం చంద్ర‌బాబు రాసుకొచ్చారు. 

Read also: TDP: టీడీపీ మహానాడు ఏర్పాట్లను సమీక్షించిన నేతలు

Related Posts
హీరో కిచ్చా సుదీప్ కు మాతృవియోగం
kiccha sudeep lost his moth

కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది, ఆయన తల్లి సరోజా సంజీవ్ కన్నుమూశారు. వయసుతో సంబంధించిన అనారోగ్య సమస్యల కారణంగా కొన్ని Read more

1,690 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చేందుకు తెలంగాణ సర్కార్ సిద్ధం..
Filling up of medical posts

తెలంగాణ లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ..ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చే పనిలో ఉంది. ఇప్పటికే పలు హామీలను నెరవేర్చగ..ఇటు నిరుద్యోగులకు సైతం వరుస గుడ్ న్యూస్ Read more

Telangana Budget :అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా తెలంగాణ బడ్జెట్‌!
Telangana Budget :అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా తెలంగాణ బడ్జెట్‌!

తెలంగాణ ప్రభుత్వం 2025-26 ఆర్థిక సంవత్సరానికి గానూ భారీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. సుమారు 3.30 లక్షల కోట్లతో రూపొందించిన ఈ బడ్జెట్‌లో అభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యతనిచ్చినట్లు Read more

ఫిల్మ్ ఛాంబర్ పై కోర్టుకెక్కిన జానీ మాస్టర్
ఫిల్మ్ ఛాంబర్ పై కోర్టుకెక్కిన జానీ మాస్టర్

మహిళా కొరియోగ్రాఫర్ పై లైంగిక వేధింపుల కేసులో జైలుకు వెళ్లి, బెయిల్ పై విడుదలైన జానీ మాస్టర్ కు మరో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఫిల్మ్ ఛాంబర్ Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×