ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లేందుకు చురుగ్గా పనిచేస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బహుళ రంగాల్లో పెట్టుబడులు తీసుకొచ్చే లక్ష్యంతో ఎన్నో చారిత్రాత్మక ఒప్పందాలు కుదుర్చుకుంటోంది. తాజాగా, “క్రియేటివ్ల్యాండ్ ఆసియా” అనే ప్రముఖ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని ‘క్రియేటర్ల్యాండ్’ అనే ట్రాన్స్మీడియా ఎంటర్టైన్మెంట్ సిటీని అమరావతిలో స్థాపించేందుకు చర్యలు ప్రారంభించింది. అని చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు.

భారత్లోనే మొట్టమొదటి ట్రాన్స్మీడియా సిటీ
ఇది ఇండియాలోనే తొలి ట్రాన్స్మీడియా ఎంటర్టైన్మెంట్ సిటీ కావడం విశేషం. ట్రాన్స్మీడియా అంటే అనేక మీడియా ఫార్మాట్లను కలిపి వినూత్నమైన కథనాలను ప్రస్తావించే విధానం. ఇది చలనచిత్రం, వీడియో గేమింగ్, సంగీతం, వర్చువల్ రియాలిటీ, ఇమర్సివ్ న్యారేషన్, కృత్రిమ మేధ (AI) ఆధారిత కంటెంట్ వంటి విభాగాలను సమన్వయపరచనుంది. ఈ రంగాలన్నింటిని ఒకే చోట ఏకీకృతంగా అభివృద్ధి చేయడం ద్వారా తెలుగు యువతకు, స్థానిక ప్రతిభావంతులకు ప్రపంచ స్థాయి అవకాశాలు లభించనున్నాయి.
యువతకు నూతన అవకాశాలు
రాజధాని అమరావతిలో ప్రారంభించడానికి GOAP క్రియేటివ్ల్యాండ్ ఆసియాతో చారిత్రాత్మక అవగాహన ఒప్పందం కుదుర్చుకుందని ప్రకటించడానికి సంతోషంగా ఉంది. 25వేల ఉద్యోగాలను సృష్టించే లక్ష్యంతో ఈ ప్రాజెక్ట్ ఎఫ్డీఐని ఆకర్షించడానికి,పెద్ద ఎత్తున అభివృద్ధిని తీసుకురావడానికి, స్థానిక ప్రతిభను క్రియేట్ ఇన్ ఏపీ & క్రియేట్ ఫర్ ది వరల్డ్కు శక్తివంతం చేయడానికి సిద్ధంగా ఉంది. ప్రాజెక్టులో భాగంగా, “క్రియేటర్ల్యాండ్ అకాడమీ” కూడా ఏర్పాటు కానుంది. ఇది దేశీయ విద్యార్థులకు, సాంకేతిక నిపుణులకు సినిమా, డిజిటల్ ఆర్ట్స్, గేమింగ్, మరియు వర్చువల్ ప్రొడక్షన్ రంగాల్లో నైపుణ్యాలను పెంపొందించడానికి కేంద్రంగా పనిచేస్తుంది. ఈ అకాడమీ ద్వారా యువతకు సమగ్ర శిక్షణ, ఇంటర్నేషనల్ ప్రమాణాల ప్రకారం ఉపాధి అవకాశాలు కల్పించనుంది. అని సీఎం చంద్రబాబు రాసుకొచ్చారు.
Read also: TDP: టీడీపీ మహానాడు ఏర్పాట్లను సమీక్షించిన నేతలు