ఒకే వేదికపై తెలంగాణ , ఏపీ సీఎంలు

జులై మూడో వారంలో మొట్టమొదటి ప్రపంచ కమ్మ మహాసభలు హైదరాబాద్ లో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల సీఎంల హోదాలో చంద్రబాబు, రేవంత్ రెడ్డి హాజరవుతున్నారు. ఈ విషయాన్ని కమ్మ మహాసభ నిర్వాహకుడు జెట్టి కుసుమకుమార్ వెల్లడించారు.

హైదరాబాద్ లోని హెచ్ఐసీసీ ఈ ప్రపంచ కమ్మ మహాసభ వేడుకలకు వేదికగా నిలవనుంది. ఈ సభలకు భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా ముఖ్య అతిథిగా రానున్నారు. రాజకీయాల్లో చంద్రబాబు, రేవంత్ రెడ్డిలను గురుశిష్యులుగా అంత చెప్పుకుంటారు. అలాంటి వారు ఫస్ట్ టైం ఒకే వేదిక ఫై కనిపించబోతున్నారు.