ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భవిష్యత్తులో అభివృద్ధికి నాంది పలికే ప్రాజెక్ట్గా నిలిచిన అమరావతి రాజధాని పనుల పునః ప్రారంభ కార్యక్రమం విజయవంతంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒక అధికారిక ప్రకటన విడుదల చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా జరిగిన ఈ కార్యక్రమాన్ని అపూర్వంగా విజయవంతం చేసిన ప్రతీ ఒక్కరికీ ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
ప్రధానమైన కృతజ్ఞతలు:
రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చి పాల్గొన్న ప్రజలను ఉద్దేశిస్తూ, వారి ఉత్సాహం, మద్దతే తమ ప్రభుత్వానికి గొప్ప శక్తిననిచ్చాయి అని తెలిపారు. రాజధాని నిర్మాణానికి భూములు సమర్పించిన రైతులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. వారు ఇచ్చిన త్యాగం ఏ ఇతర రాష్ట్రంలో కనిపించదని కొనియాడారు. అదే విధంగా, అమరావతి పునఃప్రారంభ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన ప్రభుత్వ యంత్రాంగం, పోలీస్ విభాగం, సాంకేతిక బృందం, ప్రోటోకాల్ మరియు వ్యవస్థాపనా బాధ్యతలు నిర్వహించిన అధికారులకు అభినందనలు తెలిపారు. కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లిన మీడియా, సోషల్ మీడియా వారికి కృతజ్ఞతాపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ప్రజల సహకారంతో, కేంద్ర మద్దతుతో, పక్కా ప్రణాళికతో అందరికీ అవకాశాలు సృష్టించేలా, రాష్ట్రానికి చోదక శక్తిగా నిలిచేలా ఫ్యూచర్ సిటీగా రాజధాని అమరావతిని నిర్మిస్తాం. అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధి సాధించి, మాకు అండగా ఉన్న ప్రజల నమ్మకాన్ని నిలబెడతాం అని తెలుపుతూ ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. అన్ని ప్రాంతాల అభివృద్ధికి ఇది కేంద్రబిందువుగా మారుతుంది, మరియు అమరావతి రాష్ట్రానికి గర్వకారణంగా నిలుస్తుందని పేర్కొన్నారు.
Read also: Amaravati : అమరావతి పునః నిర్మాణానికి నరేంద్ర మోడీ శంకుస్థాపన