Chandrababu: ఘనంగా జరిగిన అమరావతి నిర్మాణ పునఃప్రారంభం – సీఎం చంద్రబాబు 

Chandrababu: ఘనంగా జరిగిన అమరావతి నిర్మాణ పునఃప్రారంభం – సీఎం చంద్రబాబు 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భవిష్యత్తులో అభివృద్ధికి నాంది పలికే ప్రాజెక్ట్‌గా నిలిచిన అమరావతి రాజధాని పనుల పునః ప్రారంభ కార్యక్రమం విజయవంతంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒక అధికారిక ప్రకటన విడుదల చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా జరిగిన ఈ కార్యక్రమాన్ని అపూర్వంగా విజయవంతం చేసిన ప్రతీ ఒక్కరికీ ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

Advertisements

ప్రధానమైన కృతజ్ఞతలు:

రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చి పాల్గొన్న ప్రజలను ఉద్దేశిస్తూ, వారి ఉత్సాహం, మద్దతే తమ ప్రభుత్వానికి గొప్ప శక్తిననిచ్చాయి అని తెలిపారు. రాజధాని నిర్మాణానికి భూములు సమర్పించిన రైతులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. వారు ఇచ్చిన త్యాగం ఏ ఇతర రాష్ట్రంలో కనిపించదని కొనియాడారు. అదే విధంగా, అమరావతి పునఃప్రారంభ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన ప్రభుత్వ యంత్రాంగం, పోలీస్ విభాగం, సాంకేతిక బృందం, ప్రోటోకాల్ మరియు వ్యవస్థాపనా బాధ్యతలు నిర్వహించిన అధికారులకు అభినందనలు తెలిపారు. కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లిన మీడియా, సోషల్ మీడియా వారికి కృతజ్ఞతాపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ప్రజల సహకారంతో, కేంద్ర మద్దతుతో, పక్కా ప్రణాళికతో అందరికీ అవకాశాలు సృష్టించేలా, రాష్ట్రానికి చోదక శక్తిగా నిలిచేలా ఫ్యూచర్ సిటీగా రాజధాని అమరావతిని నిర్మిస్తాం. అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధి సాధించి, మాకు అండగా ఉన్న ప్రజల నమ్మకాన్ని నిలబెడతాం అని తెలుపుతూ ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అని సీఎం చంద్ర‌బాబు పేర్కొన్నారు. అన్ని ప్రాంతాల అభివృద్ధికి ఇది కేంద్రబిందువుగా మారుతుంది, మరియు అమరావతి రాష్ట్రానికి గర్వకారణంగా నిలుస్తుందని పేర్కొన్నారు.

Read also: Amaravati : అమరావతి పునః నిర్మాణానికి నరేంద్ర మోడీ శంకుస్థాపన

Related Posts
Palallo :కల్తీ పెరుగుదల: ఆరోగ్యానికి పెరుగుతున్న ముప్పు
పాలల్లో కల్తీ పెరుగుదల: ఆరోగ్యానికి పెరుగుతున్న ముప్పు

పాలల్లో కల్తీ పెరుగుదల: ఆరోగ్యానికి పెరుగుతున్న ముప్పు పాలల్లో కల్తీ – ఆరోగ్యాన్ని ముంచెత్తుతున్న మృత్యు ముంగిట నవుడికే కాదు, పశుపక్ష్యాదుల ఆరోగ్యానికి కూడా కల్తీ ప్రమాదంగా Read more

హరీష్ రావు పై మంత్రి జూపల్లి కృష్ణారావు ఫైర్
jupalli

హరీష్ రావు పై మంత్రి జూపల్లి కృష్ణారావు ఫైర్. ఎస్‌ఎల్‌బీసీ సొరంగ ప్రమాదంపై రాజకీయ వేడిని పెంచుతూ మంత్రి జూపల్లి కృష్ణారావు, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్ Read more

సుప్రీంకోర్టు తుది తీర్పునకు లోబడే ప్రభుత్వం వ్యవహరిస్తుంది
ఎంపిహెచ్ఎల తొలగింపుపై

ఎంపిహెచ్ఎల తొలగింపుపై మండలిలో ప్రశ్న – మంత్రి సమాధానం సుప్రీంకోర్టు తుది తీర్పునకు లోబడే ప్రభుత్వం వ్యవహరిస్తుంది అమరావతి: వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖలో ఒప్పంద ప్రాతిపదికపై Read more

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం.. భారతీయుల మృతి
Russia Ukraine war.. Indian

రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో 12 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. రష్యా తరఫున యుద్ధంలో పాల్గొంటున్న వీరిలో ఇంకా 16 మంది అదృశ్యంగా ఉన్నారని Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×