మంత్రి భార్య ఫై సీఎం చంద్రబాబు ఆగ్రహం

కడప – రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాం ప్రసాద్ రెడ్డి సతీమణి తన వెంట స్థానిక ఎస్‌ఐ రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పబ్లిక్‌లో పోలీసులపై జులుం ప్రదర్శించారు. మంత్రి భార్య మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీనిపై నెటిజన్లు , ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం చంద్రబాబు వరకు వెళ్లడం తో మంత్రి ఫై కాస్త అసహనం వ్యక్తం చేసారు.

మంత్రి భార్య పోలీసులతో మాట్లాడిన విధానం సరికాదని పేర్కొన్నారు. పోలీసులు, అధికారులు, ఇతర ఉద్యోగుల పట్ల ప్రతి ఒక్కరూ గౌరవభావంతో మెలగాలని, ప్రభుత్వానికి మచ్చ తెచ్చేలా వ్యవహరిస్తే సహించలేది లేదని బాబు స్పష్టం చేశారు. కాగా, ఈ ఘటనపై మంత్రి రాంప్రసాద్ రెడ్డి స్పందించారు. తన భార్య హరితారెడ్డి పోలీసులతో వ్యవహరించిన తీరు పట్ల ఆయన విచారం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా చూసుకుంటానని తెలిపారు.