పవన్ హత్యకు భారీ కుట్ర..

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హత్య కు భారీ కుట్ర జరుగుతున్నట్లు కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించినట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కొన్ని అవాంఛనీయ గ్రూపుల్లో పవన్ కల్యాణ్ ప్రస్తావన వచ్చిందని, ప్రతి నిమిషం జాగ్రత్తగా ఉండాలని స్పష్టం చేశాయి. పవన్ ను టార్గెట్ చేసిన ఆ గ్రూపులు ఎవరివి అనేది ఇప్పుడే చెప్పలేమని నిఘా వర్గాలు పేర్కొన్నాయి. పవన్ కల్యాణ్ తన భద్రత పట్ల గట్టి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపాయి.

పవన్ కల్యాణ్ ఎన్డీయే కూటమిలో కీలక నేతగా ఉండడం, ప్రధాని నరేంద్ర మోదీకి గట్టి మద్దతుదారు కావడంతో, ఆయనను మావోయిస్టులు లక్ష్యంగా చేసుకున్నారని కొన్ని వార్తలు వస్తున్నాయి. వీటిలో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం మాత్రం పర భద్రతను పెంచేందుకు ప్రభుత్వం సిద్ధం అవుతుంది. ఇక పవన్ హత్య కు ప్లాన్ చేశారనే వార్తలు విన్న అభిమానులు , పార్టీ శ్రేణులు ఖంగారుపడుతూ జాగ్రత్త్త చెపుతున్నారు.