Central approval for Tirupati Pakala Katpadi doubling works

Tirupati Pakala : తిరుపతి-పాకాల-కాట్పాడి డబ్లింగ్ పనులకు కేంద్ర ఆమోదం

Tirupati Pakala : తిరుపతి-పాకాల-కాట్పాడి మధ్య 104 కిలోమీటర్ల మేర డబ్లింగ్‌ పనులకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించిన వివరాలను కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ వెల్లడించారు. రూ.1332 కోట్లతో ఈ పనులు చేపట్టనున్నట్లు చెప్పారు. ఢిల్లీలో ఏర్పాటు చేసిన ఓ మీడియా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తిరుపతి-పాకాల-కాట్పాడి డబ్లింగ్ పనులతో 35 లక్షల పనిదినాలు కల్పించే అవకాశం ఉందని అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు. ఈ పనుల ద్వారా 400 గ్రామాల్లోని 14 లక్షల మంది జనాభా లబ్ధి పొందుతారని చెప్పారు. మరోవైపు పర్యాటకంగా ఎంతో అభివృద్ధి జరిగేందుకు ఆస్కారం ఉంటుందన్నారు. లక్షల సంఖ్యలో సందర్శకులు వస్తారని పేర్కొన్నారు. ఈ డబ్లింగ్‌ ప్రాంతంలోనే తిరుపతి, శ్రీకాళహస్తి, చంద్రగిరి కోట ఉన్నాయని ఆయన వివరించారు.

Advertisements
  తిరుపతి-పాకాల-కాట్పాడి డబ్లింగ్

ప్రాజెక్టు ద్వారా చిత్తూరు, తిరుపతి, వెల్లూరు జిల్లాకు లబ్ధి

అదేవిధంగా తిరుపతి, వెల్లూరు ప్రాంతాలు వైద్య, విద్య హబ్‌లుగా ఉన్నాయి. ఈ ప్రాజెక్టు ద్వారా రాయలసీమ రీజియన్‌కు లబ్ధి చేకూరుతుంది. ఎలక్ట్రానిక్స్‌, సిమెంట్‌, స్టీల్‌ తయారీ కంపెనీలు లబ్ధి పొందనున్నాయి. ప్రాజెక్టు ద్వారా చిత్తూరు, తిరుపతి, వెల్లూరు జిల్లాకు లబ్ధి చేకూరుతుంది. ఇందులో భాగంగా 17 మేజర్‌, 327 మైనర్‌ వంతెనలు వస్తున్నాయి. అదేవిధంగా 7 పైవంతెనలు, 30 అండర్‌ పాస్‌ బ్రిడ్జ్‌లు రానున్నాయని’ అశ్వినీ వైష్ణవ్‌ పేర్కొన్నారు. తద్వారా 104 కిలోమీటర్ల మార్గం రోడ్డుకు బదులు రైలు మార్గానికి రద్దీ మళ్లుతుందని అశ్వినీ వైష్ణవ్ పేర్కొన్నారు. 20 కోట్ల కిలోల కార్బన్‌డయాక్సైడ్‌ తగ్గుతుందన్నారు. అదేవిధంగా 4 కోట్ల లీటర్ల డీజిల్‌ పొదుపు అవుతుందని చెప్పారు. ఏడాదికి 4 మిలియన్ టన్నుల సరుకు రవాణాకు అవకాశం ఉంటుందని తెలిపారు.

Read Also: అమరావతిలో ఇంటి నిర్మాణానికి భూమిపూజ చేసిన చంద్రబాబు

Related Posts
Telangana Government : కంచ భూములపై కేంద్ర కమిటీకి నివేదిక
Telangana Government కంచ భూములపై కేంద్ర కమిటీకి నివేదిక

తెలంగాణలో హాట్ టాపిక్‌గా మారిన కంచ గచ్చిబౌలి భూములపై కీలక పరిణామం జరిగింది ఈ భూముల విషయంలో కేంద్ర సాధికారిక కమిటీకి రాష్ట్ర ప్రభుత్వం నివేదికను సమర్పించింది. Read more

కెనడాలో ఖలిస్థానీ గ్రూపులపై ట్రూడో ప్రకటన
trudo

కెనడా మరియు భారతదేశం మధ్య డిప్లొమాటిక్ సంబంధాలు ప్రస్తుతం ఉద్రిక్తతలకు లోనయ్యాయి. ఈ పరిస్థితి మరింత ఘటించి, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఇటీవల తొలిసారిగా కెనడాలో Read more

ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మికి భారీ ఊరట
kova lakshmi

ఆసిఫాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవలక్ష్మి తన ఎన్నికకు సంబంధించి తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుతో ఊరట పొందారు. 2023 ఎన్నికల్లో కోవలక్ష్మి అందించిన అఫిడవిట్‌లో ఆదాయపన్ను లెక్కల్లో Read more

అంతర్జాతీయ విలేకరుల దినోత్సవం: సత్యం, ధైర్యం, అంకితభావానికి గౌరవం!
Journalist day

ప్రతిభావంతుల విలేకరుల సేవలను గుర్తించడానికి ప్రతి సంవత్సరం నవంబర్ 19న "అంతర్జాతీయ విలేకరుల దినోత్సవం" జరుపుకుంటాం. ఈ రోజు, తమ విధులను నిర్వర్తించేప్పుడు ప్రాణాలు పోయిన విలేకరులను Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×