Center is good news for Gun

గుంటూరు జిల్లాకు కేంద్రం గుడ్ న్యూస్

NDA తో టీడీపీ జత కట్టడం తో ఏపీకి వరుస గుడ్ న్యూస్ అందజేస్తుంది కేంద్రం. ముఖ్యంగా రాష్ట్రానికి నిధుల సమస్య అనేది లేకుండా అవుతుంది. రాజధాని జిల్లా అయిన గుంటూరుకు NDA సర్కార్ భారీ శుభవార్త తెలిపింది.

గుంటూరు నగరంలో శంకర్‌ విలాస్‌ ఫ్లైఓవర్‌ ఉంది. అప్పటి నగర జనాభాకు తగ్గట్టు ఈ ఫ్లైఓవర్‌ నిర్మించారు. కానీ ఇప్పుడు ఈ ఫ్లైఓవర్‌ ఇరుకుగా మారింది. ఇక్కడ మరో ఫ్లై ఓవర్‌ నిర్మించాలని ఎప్పటి నుంచో ప్రతిపాదనలు ఉన్నాయి. ప్రభుత్వాలు మారుతున్నా ఫ్లైఓవర్‌కు మాత్రం మోక్షం కలగలేదు. ఇరుకైన రోడ్లలో పట్టణవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాహనాలు నెమ్మదిగా కదులుతూ ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడుతోంది. అయితే ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వస్తే ఫ్లైఓవర్‌ నిర్మిస్తామని కూటమి తరఫున పోటీ చేసిన లోక్‌సభ అభ్యర్థి, ప్రస్తుత కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ ప్రకారం ఇప్పుడు కేంద్రం తో మాట్లాడి నూతన ఫ్లైఓవర్‌ నిర్మాణానికి కేంద్రం నుండి గ్రీన్ సిగ్నల్ వచ్చేలా చేసారు.

ఈ సందర్భంగా కేంద్ర రోడ్లు, రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కర్‌ నిధులు విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ‘ఎక్స్‌’ వేదికగా ఆయన ఓ పోస్టు చేశారు. గుంటూరులోని శంకర్‌ విలాస్‌ ఫ్లైఓవర్‌ నిర్మాణానికి నిధులు విడుదల చేస్తున్నాం. రూ.98 కోట్లు మంజూరు చేశాం. ఈ నిధులతో గుంటూరులో ట్రాఫిక్‌ ఇబ్బందులు తొలగనున్నాయి’ అని నితిన్‌ గడ్కరీ తెలిపారు. అంతేకాకుండా ఏపీలో రోడ్ల నిర్మాణానికి రూ.400 కోట్లు మంజూరు కావడం విశేషం. రాష్ట్రంలో 200 కిలోమీటర్ల మేర 13 రాష్ట్ర రహదారుల నిర్మాణానికి కేంద్రం ఆమోదం తెలపడంతో సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. గుంటూరు ఫ్లై ఓవర్‌కు నిధులు విడుదల కావడంపై కేంద్ర మంత్రి, స్థానిక ఎంపీ పెమ్మసాని స్పందిస్తూ కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

Related Posts
ఆర్జీ కార్ కేసులో సంజయ్ రాయ్ కోర్టులో ఏం చెప్పాడు?
ఆర్జీ కార్ కేసులో సంజయ్ రాయ్ కోర్టులో ఏం చెప్పాడు?

కోల్కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో ట్రైనీ డాక్టర్పై అత్యాచారం, హత్య కేసులో మాజీ సివిల్ వాలంటీర్ సంజయ్ రాయ్‌ను దోషిగా నిర్ధారించారు. తనను Read more

నేడు పశ్చిమ గోదావరి జిల్లాలో చంద్రబాబు పర్యటన
Untitled 1CM Chandrababu visit to West Godavari district today

అమరావతి: సీఎం చంద్రబాబు నేడు పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు దంపతులు వాసవీ మాత ఆలయాన్ని సందర్శించనున్నారు. అనంతరం వాసవీ Read more

దేశంలో మ‌హిళా కేంద్రీకృత అభివృద్ధి : ప్రధాని
Rozgar Mela.. PM Modi who gave appointment letters to 71 thousand people

న్యూఢిల్లీ: ప్రధాని మోడీ "రోజ్‌గార్‌ మేళా" లో భాగంగా ఈరోజు 71 వేల మంది అపాయింట్‌మెంట్ లేఖ‌లు అంద‌జేశారు. ఈ సందర్భంగా ప్రధాని మవ‌ర్చువ‌ల్‌ కార్య‌క్ర‌మాన్ని ఉద్దేశిస్తూ Read more

ఏపీకి వెళ్లిన ఐఏఎస్‌ల స్థానంలో ఇంఛార్జ్‌ల నియామకం
incharge ias in telangana

తెలంగాణ నుంచి రిలీవ్ అయిన పలువురు IAS అధికారుల స్థానంలో రాష్ట్ర ప్రభుత్వం ఇంఛార్జులను నియమించింది. ఇటీవల డీవోపీటీ తెలంగాణ కేడర్‌లో కొనసాగుతున్న ఐఏఎస్‌లను ఏపీకి, ఏపీలో Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *