CAT Shock to IAS Officers

క్యాట్ కీలక తీర్పు..వారంతా ఏపీకి వెళ్లాల్సిందే

ఐఏఎస్‌(CAT)ల పిటిషన్లపై ఐదుగురు ఐఏఎస్‌(IAS)లకు షాక్ ఇస్తూ క్యాట్ కీలక తీర్పు వెలువరించింది. రాష్ట్ర పునర్విభజన సందర్భంగా జరిగిన కేటాయింపుల ప్రకారం ఆయా రాష్ట్రాలకు వెళ్లాలంటూ ఈ నెల 9న కేంద్రం జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ ఐఏఎస్ అధికారులు వాకాటి కరుణ, కె.ఆమ్రపాలి, ఎ. వాణీప్రసాద్, డి. రొనాల్డ్స్, జి.సృజనలు పిటిషన్ వేయగా వారికీ షాక్ ఇచ్చింది.

రేపు ఎక్కడివాళ్లు అక్కడ రిపోర్ట్ చేసి తీరాలని ఆదేశాలు ఇచ్చింది. అంతకుముందు క్యాట్‌లో కీలక వాదనలు కొనసాగాయి. IAS అధికారులపై క్యాట్‌ కీలక వ్యాఖ్యలు చేసింది. ఏపీలో వరదలతో ప్రజలు ఇబ్బందిపడుతున్నారు, వారికి సేవచేయాలని లేదా? అని ప్రశ్నించింది.

స్థానికత ఉన్నప్పటికీ, స్వాపింగ్‌ చేసుకోవచ్చని గైడ్‌లైన్స్‌లో ఉందా? అని అడిగింది. ఐఏఎస్‌ల కేటాయింపుపై డీఓపీటీకి నిర్ణయం తీసుకునే అధికారం ఉందని గుర్తుచేసింది. వన్‌ మెన్‌ కమిటీ సిఫారసులను డీఓపీటీ ఎలా అమలు చేస్తుంది. వన్‌ మెన్‌ కమిటీ సిఫారసు చేసినప్పుడు ఎందుకు హైకోర్టుకు వెళ్లలేదని ఐఏఎస్‌లను క్యాట్‌ ప్రశ్నించింది.

ప్రస్తుతం తెలంగాణలో పనిచేస్తున్న వాకాటి కరుణ, ఆమ్రపాలి, వాణీప్రసాద్, రొనాల్డ్ రాస్లు కేంద్రం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం ఏపీకి వెళ్లాల్సి ఉంది. ప్రస్తుతం ఏపీలో పనిచేస్తున్న సృజన తెలంగాణకు రావాల్సి ఉంది. ప్రస్తుతం తాము పనిచేస్తున్న రాష్ట్రంలోనే కొనసాగించేలా ఉత్తర్వులు జారీ చేయాలని, కేంద్రం జారీ చేసిన కేటాయింపు ఉత్తర్వులను రద్దు చేయాలని పిటిషన్లో కోరారు. కేటాయింపుల సమయంలో కేంద్రం తమ అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకోలేదని తెలిపారు.

పిటిష‌నర్ల త‌రుపున క్యాట్ ముందు త‌మ వాద‌న‌లు వినిపించారు.. అనంత‌రం వారి పిటిషన్ లు కొట్టివేస్తూ,టివోపిటీ ఆదేశాల‌ను పాటించాల్సిందేన‌ని,దీనిపై ఎటువంటి మిన‌హాయింపులు లేవ‌ని క్యాట్ తుదితీర్పు ఇచ్చింది.

Related Posts
ఫార్మసీ కంపెనీ లపై ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
mla anirudhreddy

జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసి, అరబిందో కంపెనీపై తీవ్ర విమర్శలు చేశారు. మహబూబ్ నగర్ జిల్లాలోని పోలేపల్లి గ్రామానికి చెందిన స్థానిక రైతులు Read more

ఏపీకి నాయ‌క‌త్వం వ‌హించే సామ‌ర్థ్యం కేవలం పవన్ కే ఉంది – విజయసాయి రెడ్డి
vijayasai cbn

వైసీపీ సీనియర్ నేత, ఎంపీ విజయసాయి రెడ్డి తాజాగా ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని ఉద్దేశిస్తూ.. 75 ఏళ్ల వృద్ధుడు ఆంధ్రప్రదేశ్‌కు Read more

భారతదేశం చేసిన హైపర్సోనిక్ క్షిపణి పరీక్ష: చరిత్రాత్మక విజయం
hypersonic missile

భారతదేశం తొలి లాంగ్-రేంజ్ హైపర్సోనిక్ క్షిపణి ని విజయవంతంగా పరీక్షించింది. ఈ పరీక్ష భారతదేశం యొక్క రక్షణ సామర్థ్యాలను పెంచే దిశగా కీలకమైన అడుగుగా నిలిచింది. ప్రభుత్వ Read more

వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్ల నియామకం
Appointment of YCP Regional

వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్లను నియమించింది. ఉమ్మడి అనంతపురం, నెల్లూరు జిల్లా-పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, ఉమ్మడి ప్రకాశం జిల్లా-కారుమూరి నాగేశ్వరరావు, ఉమ్మడి కడప, కర్నూలు-పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఉమ్మడి Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *