ఖైరతాబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం పై కేసు నమోదు

ఖైరతాబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ కు బిగ్ షాక్ తగిలింది. జూబ్లీహిల్స్‌లోని నందగిరి హిల్స్‌లోని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) ప్రాపర్టీలోని కాంపౌండ్ వాల్‌ను కూల్చివేసినందుకు గాను ఎమ్మెల్యే దానం నాగేందర్ తో పాటు ఆయన అనుచరులపై జూబ్లీహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.

నందిగిరి కొండల వద్ద ఉన్న జీహెచ్‌ఎంసీ పార్కు గోడను ఎమ్మెల్యే తన అనుచరులతో కలిసి కూల్చివేశారని GHMC ఎన్‌ఫోర్స్‌మెంట్ ఇంచార్జి వీ.పాపయ్య జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. కూల్చివేత వల్ల దాదాపు రూ. 10 లక్షల వరకు ఆర్థిక నష్టం వాటిల్లిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. పాపయ్య చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు దానం నాగేందర్‌తోపాటు మరికొందరిపై ఐపీసీ, పీడీపీపీ చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.