కొడాలి నానిపై మరో కేసు

గుడివాడ వైసీపీ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని కి వరుస షాకులు ఇస్తుంది కూటమి సర్కార్. నిన్నటికి నిన్న నాని కబ్జా చేసిన శరత్ థియేటర్ ను సదరు థియేటర్ యాజమాన్యంకు ఇప్పించారు గుడివాడ ఎమ్మెల్యే రాము. గత కొంతకాలంగా నాని ..శరత్ థియేటర్ ను తన పార్టీ ఆఫీస్ గా మార్చుకున్నారు. పలుమార్లు సదరు థియేటర్ యాజమాన్యం నాని వద్దకు వెళ్లి థియేటర్ ను అప్పగించాలని అడిగినప్పటికీ బెదిరించినట్లు ప్రచారం జరిగింది. ఇక ఇప్పుడు కూటమి సర్కార్ అధికారంలోకి రావడం తో థియేటర్ యాజమాన్యం..ఎమ్మెల్యే రాము ను కలిసి థియేటర్ ఇప్పించాలని కోరడం తో..నిన్న శరత్ థియేటర్ ను స్వాధీనం చేసుకున్నారు.

ఇదిలా ఉండగానే మరో షాక్ తగిలింది నానికి. గుడివాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో మాజీ మంత్రి కొడాలి నానిపై మరో కేసు నమోదైంది. బేవరేజెస్ కాంట్రాక్టర్ ఫిర్యాదుతో హైకోర్టు సూచనల మేరకు నానిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు విషయంలో నానికి 41A నోటీసులు ఇవ్వాలని హైకోర్టు పోలీసులను ఆదేశించింది. విచారణలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించాలని స్పష్టం చేసింది. కాగా వాలంటీర్ల ఫిర్యాదు మేరకు గత నెలలో నానిపై కేసు నమోదైంది.