ముంబై- నాగ్ పూర్ ఎక్స్ ప్రెస్ వే పై ఘోర ప్రమాదం

మహారాష్ట్రలోని ముంబై- నాగ్ పూర్ ఎక్స్ ప్రెస్ వే పై శుక్రవారం అర్ధరాత్రి ప్రాంతంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పెట్రోల్ బంక్ లో ఇంధనం నింపుకున్న స్విఫ్ట్ డిజైర్ కారు ముంబైకి వెళ్లేందుకు సమృద్ధి ఎక్స్ ప్రెస్ వే పైకి ఎక్కింది. అయితే, డ్రైవర్ నిర్లక్ష్యంతో రాంగ్ రూట్ లో హైవేపైకి ఎంటరయ్యాడు. ఆరు లేన్ల ఈ హైవేపై ముంబై నుంచి నాగ్ పూర్ వెళుతున్న ఎర్టిగా కారు ఈ కారును వేగంగా ఢీ కొట్టింది. దీంతో రెండు కార్లలో కూర్చున్న వాళ్లు ఎగిరి రోడ్డుపై పడ్డారు.

ఈ ప్రమాదంలో ఆరుగురు స్పాట్ లోనే చనిపోయారు. ఎక్స్ ప్రెస్ వే పై మృతదేహాలు చెల్లాచెదురుగా పడ్డాయి. ప్రమాదం విషయం తెలిసిన వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు.. తీవ్ర గాయాలతో పడి ఉన్న నలుగురిని దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి సీరియస్ గా ఉందని వైద్యులు వెల్లడించారు.