శామీర్‌పేటలో కారు బీభత్సం

హైదరాబాద్ లో నిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. రాష్ డ్రైవింగ్ , మద్యం మత్తు , నిద్ర మత్తులో ప్రమాదాలు చేస్తూ అమాయకుల ప్రాణాలు తీస్తున్నారు..వారి ప్రాణాలు తీస్తున్నారు. తాజాగా శామీర్‌పేటలో ఓ కారు బీభత్సం సృష్టించింది. జీనోమ్ వ్యాలీ పోలీస్ స్టేషన్ పరిధిలో అతివేగంతో వచ్చిన ఇన్నోవా కారు అదుపుతప్పింది. అనంతరం ఎదురుగా వస్తున్న బస్సును ఢీకొట్టబోయి బోల్తా పడింది.

ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అతివేగమే ప్రమాద కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. స్థానికులు సైతం కారు వేగంగా వెళ్లిందని చెబుతున్నారు. ఈ ప్రమాదంలో మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.