సరస్వతీ పవర్ భూముల రిజిస్ట్రేషన్లు రద్దు..ఏపీ సర్కార్‌

అమరావతి: సరస్వతీ పవర్ ప్లాంట్‌కు కేటాయించిన అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్‌ను ఏపీ ప్రభుత్వం రద్దు చేసింది. సరస్వతీ భూముల్లో అసైన్డ్ ల్యాండ్స్ ఉన్నాయన్న అధికారుల నివేదికతో చర్యలు చేపట్టింది. పల్నాడు జిల్లా మాచవరం మండలం వేమవరంలో సరస్వతీ పవర్ ఇండస్ట్రీస్ భూముల రిజిస్ట్రేషన్‌ను క్యాన్సిల్ చేసింది. వేమవరంలో 20 ఎకరాలు, పిన్నెల్లి గ్రామంలో 4.84 ఎకరాల అసైన్డ్ భూమి రిజిస్ట్రేషన్‌ను కలెక్టర్ అరుణ్‌బాబు ఆదేశాలతో అధికారులు రద్దు చేశారు. ఈ మేరకు పిడుగురాళ్ల సబ్ రిజిస్ట్రార్ సురేశ్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఆ భూములు వెనక్కు తీసుకోవాలని ఆదేశించారు.

కాగా, పల్నాడు జిల్లా జగన్ కుటుంబానికి సరస్వతీ పవర్ ఇండస్ట్రీస్ భూములు కేటాయించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో 1,516 ఎకరాల భూముల్లో అటవీ, ప్రభుత్వ భూములు ఉన్నాయనే ఆరోపణలు వచ్చాయి. చెన్నయపాలెం, వేమవరం, పిన్నెల్లి, తంగెడ గ్రామాల్లో మొత్తం 1,250 ఎకరాలు రైతుల నుంచి సరస్వతీ పవర్ ప్లాంట్ యాజమాన్యం కొనుగోలు చేసింది. అయితే, అప్పటి నుంచి ఆ భూముల్లో ఎలాంటి నిర్మాణాలు చేయలేదని స్థానికులు ఆరోపించారు. ఇదే భూముల్లో అటవీ శాఖ భూములు కూడా ఉన్నాయన్న వివాదంతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సైతం పర్యటించారు. ఈ వ్యవహారంపై మరింత లోతుగా దర్యాప్తు చేయాలని అధికారులను ఆదేశించారు.

image

డిప్యూటీ సీఎం పవన్ ఆదేశాలతో కదిలిన అధికార యంత్రాంగం సదరు భూముల్లో పూర్తి స్థాయి సర్వే చేపట్టింది. గత నవంబరులో అసైన్డ్ ల్యాండ్స్‌కు సంబంధించిన వ్యవహారంపై రెవెన్యూ, అటవీ శాఖ అధికారులు సర్వే నిర్వహించారు. ఇందులో భాగంగానే వేమవరం, పిన్నెల్లి గ్రామాల్లో 24.84 ఎకరాల అసైన్డ్ ల్యాండ్ ఉన్నట్లు గుర్తించారు. ఈ భూములు రద్దు కోరుతూ నివేదిక ఇవ్వడంతో సరస్వతి పవర్ ప్లాంట్స్ భూమిలోని అసైన్డ్ ల్యాండ్స్ రిజిస్ట్రేషన్ రద్దు చేశారు.

Related Posts
త్రివేణి సంగ‌మంలో సాధువులు, అకాడాలు అమృత స్నానం..భారీ బందోబ‌స్తు
Saints and Akkads for amrita bath.. Huge arrangement at Triveni Sangam

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని ప్ర‌యాగ్‌రాజ్ కుంభ‌మేళాలో ఈరోజు సాధువులు, అకాడాలు, స‌న్యాసులు.. అమృత స్నానం ఆచ‌రించేందుకు సంగమం వ‌ద్ద‌కు రానున్నారు. దీంతో అక్క‌డ భారీ సంఖ్య‌లో పోలీసుల‌ను మోహ‌రించారు. Read more

‘ఢిల్లీకి చక్కర్లు కొడుతున్న సీఎం..గల్లీల్లో తిరిగి చూసే ఓపిక లేదా’ – కేటీఆర్
ktr revanth

రైతుల సమస్యలు పట్టించుకోవడం లేదంటూ సీఎం రేవంత్ ఫై కేటీఆర్ ట్విట్టర్ వేదికగా విమర్శలు చేసారు. . 'ఢిల్లీకి చక్కర్లు కొడుతున్న సీఎం కు తెలంగాణ గల్లీల్లో Read more

అమీన్‌పూర్‌లో సాఫ్ట్‌వేర్ దంపతుల మృతి
అమీన్‌పూర్‌లో సాఫ్ట్‌వేర్ దంపతుల మృతి

అమీన్పూర్ మునిసిపాలిటీలోని శ్రీరామ్ హిల్స్ కాలనీలో ఆదివారం రాత్రి ఒక విషాద ఘటన చోటుచేసుకుంది. ఒక సాఫ్ట్వేర్ జంట తమ ఇంట్లో ఉరి వేసుకుని మృతిచెందింది. మృతులను Read more

తండేల్ పై భారీగా అంచనాలు.
thandel movie

నాగచైతన్య - సాయిపల్లవి నటించిన సినిమా ఇది. బన్నీ వాసు నిర్మించిన ఈ సినిమాకి చందూ మొండేటి దర్శకత్వం వహించాడు. రేపు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *