సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం

CM Revanth Reddy

హైదరాబాద్‌: సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన తెలంగాణ అసెంబ్లీ కమిటీ హాల్‌లో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. ఇందులో 2024-25 బడ్జెట్‌కు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. మధ్యాహ్నం 12 గంటలకు శాసనసభలో ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క, శాసనమండలిలో మంత్రి శ్రీధర్‌బాబు బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నారు.

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ఆగస్టు 2 వరకు కొనసాగనున్నాయి. ఈనెల 26న అసెంబ్లీకి సెలవు, 27న బడ్జెట్‌ పద్దుపై చర్చ జరగనుంది. 28న ఆదివారం సెలవు ఉంటుంది. 29, 30 తేదీల్లో వివిధ బిల్లులు ప్రవేశపెట్టనున్నారు. 31న ద్రవ్యవినిమయ బిల్లు సభ ముందుకు తీసుకురానున్నారు. ఆగస్టు 1, 2 తేదీల్లో వివిధ బిల్లులు ప్రవేశపెట్టనున్నారు.