మాజీ మంత్రి లక్ష్మారెడ్డి సతీమణి కన్నుమూత..

మాజీమంత్రి, బీఆర్ఎస్ పార్టీ మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షుడు చెర్లకోల్ల లక్ష్మారెడ్డి సతీమణి శ్వేతా లక్ష్మారెడ్డి(60) సోమవారం రాత్రి కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి సోమవారం రాత్రి మృతి చెందారు. ఈమె మరణంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తన భర్త లక్ష్మారెడ్డితో పాటు వైద్య సేవలు అందించి.. రాజకీయంగా ఆయనకు అండగా ఉంటూ వచ్చింది శ్వేతా లక్ష్మారెడ్డి.

శ్వేతా రెడ్డి పార్థివదేహాన్ని చెన్నై నుండి మంగళవారం ఉదయం 6 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్టుకు తీసుకువస్తారని అక్కడి నుండి నేరుగా జడ్చర్ల మీద నుండి స్వగ్రామమైన ఆవంచకు తీసుకురానున్నారు. మధ్యాహ్నం మూడు గంటల తర్వాత ఆవంచ గ్రామములో అంత్యక్రియలు జరగనున్నాయి. కాగా శ్వేతా లక్ష్మారెడ్డి మృతి పట్ల రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ప్రకటన విడుదల చేశారు. కాగా అంత్యక్రియలకు బీఆర్ఎస్ అగ్రనేతలు కేటీఆర్, హరీష్ రావు తదితరులు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాలు వెల్లడించారు.