BRS held a huge public meeting in April 27

నా మీద కూడా కేసులు న‌మోదు చేస్తారా డీజీపీ గారూ..? కేటీఆర్ ప్రశ్న

హైదరాబాద్‌: ఆ రైతును నేను కూడా కలిశాను… అతనితో మాట్లాడాను… మరి నాపై కూడా కేసు పెడతారా డీజీపీ గారూ? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ అనవసరంగా గెలిచిందని, కేసీఆర్ గెలవాల్సిందని నల్గొండ జిల్లాలోని ముషంపల్లి గ్రామానికి చెందిన రైతు మల్లయ్య అన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను జర్నలిస్ట్ గౌతమ్ పోతగోని తన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేశాడు. దీంతో పోలీసులు ఆ జర్నలిస్ట్‌పై కేసు పెట్టారు.

ఈ ఘటనపై కేటీఆర్ స్పందించారు. అసలు ఈ వీడియోలో తప్పు ఏముందని డీజీపీని ప్రశ్నించారు. జర్నలిస్ట్ గౌతమ్ గౌడ్‌పై కేసు ఎందుకు నమోదు చేశారని నిలదీశారు. నేను కూడా ముషంపల్లిలో రైతు మల్లయ్యను కలిశానని, అతనితో మాట్లాడానని వెల్లడించారు. అలాంటప్పుడు నాపై కూడా కేసు పెడతారా? అని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.

కేసీఆర్ గెలిస్తేనే మాకు బుక్కెడు బువ్వ దొరుకుతుందని, లేకుంటే కంపలో పడి చచ్చిపోయినట్లేనని రైతు మల్లయ్య అన్నారు. కేసీఆర్ సార్ ఎక్కడ ఉన్నా రావాలన్నారు. ఇప్పుడు మాత్రం నీళ్లు లేక… కరెంట్ లేక వ్యవసాయం లేదని, దీంతో చావాలనిపిస్తోందన్నారు. ప్రస్తుత పాలనలో రైతుబంధు రావడం లేదన్నారు. కేసీఆర్ ఎక్కడున్నా రావాలని, ఆయనకే ఈసారి ఓటు వేస్తామన్నారు.

Related Posts
నేడు కొడంగల్‌లో పర్యటించనున్న సీఎం రేవంత్‌ రెడ్డి
cm revanth orders halting of tenders for rayadurgam shamshabad metro jpg

హైదరాబాద్‌: ప్రభుత్వ అధికారిక కార్యాక్రమాల్లో భాగంగా ఈరోజు సీఎం రేవంత్‌రెడ్డి తొలిసారి కొడంగల్ నియెజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ మేరకు ఆయన రూ.4,369 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన Read more

ఒక్కసారైనా జై తెలంగాణ అన్నావా..రేవంత్ – హరీష్ రావు
harish revanth

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత కేసీఆర్‌ ఆమరణ నిరాహార దీక్షకు దిగి నేటితో 15 ఏళ్లు పూర్తయిన సందర్భంగా బీఆర్‌ఎస్‌ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా Read more

కౌసిక్ రెడ్డి కి నోటీసులు
kaushikreddy

హైదరాబాద్ : …పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన కేసులో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి నోటిసులు.శుక్రవారం ఉదయం 10 గంటలకు విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు ఇచ్చిన Read more

హైకోర్టు న్యాయవాదికి హైడ్రా కమిషనర్ వార్నింగ్
hydra commissioner warning

హైదరాబాద్‌లో హైడ్రా టీం అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకుంటూ చెరువుల పరిరక్షణ కోసం పోరాటం చేస్తోంది. ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకుని సమస్య Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *