రేపు కాళేశ్వరం సందర్శనకు బీఆర్ఎస్ నేతలు

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రేపు కాళేశ్వరం సందర్శనకు వెళ్లనున్నారు. అసెంబ్లీలో బడ్జెట్ ప్రసంగం ముగిసిన వెంటనే హైదరాబాద్ నుంచి ప్రత్యేక బస్సులో బయల్దేరతారు. సాయంత్రం ఎల్ అండ్ డీ రిజర్వాయర్​ను సందర్శించి, రాత్రి రామగుండంలో బీఆర్ఎస్ బృందం బస చేయనుంది. తెల్లారి శుక్రవారం ఉదయం 10 గం.కు కన్నెపల్లి పంపు హౌజ్​ను పర్యటించనున్నారు. అనంతరం మేడిగడ్డ బ్యారేజీని సందర్శించనున్నారు. దీనికి సంబదించిన ఏర్పాట్లు అన్ని పూర్తి చేశారు. బిఆర్ఎస్ నేతల పర్యటన నేపథ్యంలో బిఆర్ఎస్ శ్రేణులు నేతలకు ఘన స్వాగతం పలికేందుకు రెడీ అవుతున్నారు.

సాయంత్రం ఎల్ అండ్ టీ రిజర్వాయర్ను సందర్శించి, రాత్రి రామగుండంలో బస చేస్తారు. శుక్రవారం ఉదయం కన్నెపల్లి పంప్ హౌజ్, ఆ తర్వాత మేడిగడ్డ బ్యారేజీని సందర్శించనున్నారు.