డైరెక్టర్ పూరి ఫై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న బిఆర్ఎస్ నేతలు

పూరీ జగన్నాథ్, రామ్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’. ఈ సినిమా నుంచి ఇటీవల రెండో లిరికల్ సాంగ్ ‘మార్ ముంతా ఛోడ్ చింతా’లో మాజీ సీఎం కేసీఆర్ డైలాగ్ వాడటంపై బీఆర్ఎస్ శ్రేణులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మాజీ సీఎం కేసీఆర్ ఓ సందర్భంలో వాడిన ‘ఏం జేద్దమంటవు మరి’ డైలాగు వాడటం సరి కాదని BRS నేతలు మండిపడ్డారు. వెంటనే ఆ డైలాగ్ను తొలగించాలని లేకపోతే సినిమా విడుదలను అడ్డుకుంటామని హెచ్చరించారు.

డాషింగ్ డైరెక్టర్ పూరి – హీరో రామ్ కలయికలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ మూవీ ఎంత పెద్ద హిట్ అయ్యిందో చెప్పాల్సిన పనిలేదు. రామ్ కెరియర్ లోనే భారీ హిట్ అయ్యింది. అప్పటి వరకు వరుస ప్లాప్స్ తో కొట్టుమిట్టాడుతున్న రామ్ – పూరి లకు ఈ మూవీ ఊపిరి పోసింది. ఈ మూవీ తర్వాత మరోసారి వీరిద్దరి కాంబో లో సినిమా రాబోతుందని అప్పుడే వార్తలు వచ్చాయి. కానీ సెట్స్ ఫైకి రాలేదు. అప్పటి నుండి అభిమానులు వీరి కాంబో కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఆ కోరిక తీరుతుంది. ఆగస్టు 15 డబుల్ ఇస్మార్ట్ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

YouTube video