BRS has no right to speak on compassionate appointment.. CM Revanth Reddy

CM Revanth Reddy : కారుణ్య నియామకాలపై మాట్లాడే హక్కు బీఆర్‌ఎస్‌కు లేదు: సీఎం రేవంత్‌ రెడ్డి

CM Revanth Reddy : ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి హైదరాబాద్‌ రవీంద్రభారతిలో నిర్వహించిన ప్రజాపాలనలో కొలువుల పండగ కార్యక్రమంలో పాల్గొని బిల్డ్‌ నౌ పోర్టల్‌ ను ప్రారంభించారు. పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, పురపాలక శాఖల్లో కారుణ్య నియామకాలకు సంబంధించి 922 మందికి నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు. కారుణ్య నియామకాలు క్రమం తప్పకుండా చేపట్టాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. సీఎం పదవి చేపట్టడం కన్నా.. జడ్పీటీసీగా గెలిచినప్పుడే ఎక్కువ ఆనందం కలిగిందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. మొదటిసారిగా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Advertisements
కారుణ్య నియామకాలపై మాట్లాడే హక్కు

స్వరాష్ట్రం వచ్చినా నిరుద్యోగుల కల నెరవేరలేదు

కారుణ్య నియామకాలు మీ హక్కు. గత ప్రభుత్వం కారుణ్య నియామకాలు చేపట్టకపోవడం వల్ల మీరు పదేళ్లు నష్టపోయారు. జాబ్‌ క్యాలెండర్‌తో పాటుగా కారుణ్య నియామకాలు కూడా ఇవ్వాల్సిందే. తెలంగాణ ఉద్యమంలో నిరుద్యోగుల పాత్ర మరువలేనిది. స్వరాష్ట్రం వచ్చినా నిరుద్యోగుల కల నెరవేరలేదు. పేదలు, బడుగుబలహీన వర్గాలవారే పోటీ పరీక్షలకు సిద్ధమవుతారు. నిరుద్యోగుల బాధలను ప్రజా ప్రభుత్వం గుర్తించింది. అందుకే ఏడాదిలోనే 59వేల ఉద్యోగాలు ఇచ్చాం అన్నారు.

నిరుద్యోగుల బాధలు నాకు తెలుసు

నిరుద్యోగులను నిర్లక్ష్యం చేయడం వల్లే బీఆర్‌ఎస్‌ ఓడిపోయింది. మాకు ఉద్యోగాలు ఇవ్వని మీకు ఉద్యోగాలు ఎందుకని నిరుద్యోగులు బీఆర్‌ఎస్‌ను ఓడించారు. కారుణ్య నియామకాలపై మాట్లాడే హక్కు బీఆర్‌ఎస్‌కు లేదు. నిరుద్యోగుల బాధలు నాకు తెలుసు. ఉద్యోగ ఖాళీలను పెండింగ్‌ పెట్టొద్దని ఆదేశాలిచ్చా. పరీక్షలు నిర్వహించి నెలల వ్యవధిలోనే ఫలితాలు ఇచ్చాం. 30, 40 రోజుల్లో గ్రూప్‌-1, గ్రూప్‌-2, గ్రూప్‌-3 ఉద్యోగాల నియామకాలు పూర్తి చేస్తాం. ఉద్యోగాలు ఇచ్చినా ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయి అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.

Related Posts
నేడు రూ. 7600 కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభించనున్న ప్రధాని మోడీ
PM Modi to lay foundation stones of projects worth Rs 7600 cr in Maharashtra

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ ఈ రోజు (బుధవారం) మహారాష్ట్రలో రూ.7600 కోట్ల విలువైన అనేక అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించబోతున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వర్చువల్‌ మోడ్‌లో Read more

April 1st : ఏప్రిల్ 1 నుండి మారేవి ఇవే
April 1

ఏప్రిల్ 1, 2025 నుంచి దేశంలో కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమవుతుంది. దీనిలో భాగంగా ఆదాయపు పన్ను నిబంధనల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. కొత్త ట్యాక్స్ రీతిలో రూ.12 Read more

చర్లపల్లి ఇండస్ట్రియల్ ఏరియాలో భారీ అగ్నిప్రమాదం
huge fire broke out in Cher

హైదరాబాద్ నగర శివార్లలోని చర్లపల్లి ఇండస్ట్రియల్ ఏరియాలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. తొలుత శేషసాయి కెమికల్ పరిశ్రమలో మంటలు చెలరేగాయి. కొద్దిసేపటికే ఈ మంటలు పక్కనే ఉన్న Read more

Wakf Bill: రాజ్యసభ ముందుకు నేడు వక్ఫ్‌బోర్డు
Wakf Bill: రాజ్యసభ ముందుకు నేడు వక్ఫ్‌బోర్డు

లోక్‌సభ వక్ఫ్‌ సవరణ బిల్లును బుధవారం రాత్రి ఒంటిగంట ప్రాంతంలో ఆమోదించింది. బిల్లుకు అనుకూలంగా 288 మంది సభ్యులు ఓటు వేయగా, వ్యతిరేకంగా 232 ఓట్లు వచ్చాయి. Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×