వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ

botsa satyanarayana
botsa satyanarayana

అమరావతి: బొత్స సత్యనారాయణ కు మరో బంపర్‌ ఆఫర్‌ వచ్చింది. ఉమ్మడి విశాఖ జిల్లా నాయకుల సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. విశాఖ జిల్లా స్థానిక సంస్థల వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ పేరును పార్టీ అధినేత వైఎస్‌ జగన్ ఖరారు చేశారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జగన్మోహన్ రెడ్డి ఎలాగైనా ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారు. అందుకే బొత్స సత్యనారాయణ బరిలోకి దింపేందుకు జగన్ నిర్ణయం తీసుకున్నారు.

ఉత్తరాంధ్ర జిల్లాలో సీనియర్ నేతగా బొత్స సత్యనారాయణ కు అనుభవం ఉంది. అంతేకాకుండా కాపు సమాజిక వర్గం నేతగా కూడా ఆయనకు గుర్తింపు ఉంది. ఈ ఫ్యాక్టర్స్ అనే పద్యంలో బొత్స సత్యనారాయణ పేరును కన్ఫామ్ చేశారు జగన్. దీంతో విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ బరిలోనిలిచారు.