ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపు

Air India
Air India

తిరువనంతపురం: ముంబయి నుంచి బయలుదేరిన ఎయిరిండియా విమానానికి గురువారం బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండ్‌ చేశారు. విమానంలో ప్రస్తుతం బాంబు గుర్తింపు దళాలతో సహా భద్రతా ఏజెన్సీలు తనిఖీ చేస్తున్నాయి. బెదిరింపు సమయంలో ఎఐ 657 విమానంలో 135 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు తెలిపారు.

దీంతో ఉదయం 7.36 గంటలకు తిరువనంతపురం విమానాశ్రయంలో పూర్తి అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. తర్వాత విమానం 8 గంటలకు విమానాశ్రయంలో సురక్షితంగా దిగింది. వెంటనే దానిని ఐసోలేషన్ బేకు తరలించారు. ఈ విమానంలో మొత్తం 135 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రయాణికులు, సిబ్బందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.