నిల‌క‌డ‌గా అద్వానీ ఆరోగ్యం

బీజేపీ అగ్రనేత, దేశ మాజీ ఉప ప్రధాని LK అద్వానీ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. బుధవారం రాత్రి 9గంటలకు ఢిల్లీలోని అపోలో ఆస్పత్రిలో కుటుంబ సభ్యులు ఆయన్ను చేర్చారు. ప్రస్తుతము ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని డాక్టర్స్ తెలిపారు. ఆయన క్షేమంగా తిరిగి రావాలని బీజేపీ శ్రేణులు పూజలు చేస్తున్నారు. అద్వానీ కష్ట ఫలితంగానే ఈరోజున బీజేపీ దేశాన్ని పరిపాలించగల్గుతుందని..అలాంటి నేత పూర్తి ఆరోగ్యంతో ఇంటికి చేరుకోవాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.

ప్రధాని మోదీ సైతం అద్వానీ ఆరోగ్య పరిస్ధితి గురించి ఎప్పటికప్పుడు ఆస్పత్రి వర్గాలను అడిగి తెలుసుకుంటున్నారు. అద్వానీకి మైరుగైన వైద్యం అందించాలని మోదీ వైద్యులకు సూచించారు. దేశ ప్రధానిగా మూడోసారి పగ్గాలు చేపట్టే ముందు మోదీ అద్వానీ దగ్గరకు వెళ్లి మరీ ఆయన ఆశీర్వాదం తీసుకున్న సంగతి తెలిసిందే.