2023-24 ఏడీఆర్ నివేదిక
న్యూఢిల్లీ : బీజేపీ ఆదాయం 4340 కోట్లు.2023-24 ఆర్థిక సంవత్సరంలో దేశంలోని జాతీయ పార్టీలకు వచ్చిన విరాళాల్లో అత్యధికంగా రూ.4,340.47 కోట్లు పొందిన కేంద్రంలోని అధికార బీజేపీ మొదటిస్థానంలో నిలిచింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం 2022-23తో పోలిస్తే కమలం పార్టీ ఆదాయం 83.85 శాతం పెరిగింది. దేశంలోని 6 జాతీయ పార్టీలకు వచ్చిన మొత్తం రూ.5,820.91 కోట్ల విరాళాల్లో బీజేపీ వాటా 75 శాతం కావడం గమనార్హం.

రూ.1225.11 కోట్లతో కాంగ్రెస్ పార్టీ రెండో స్థానం
ఈ మేరకు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్(ఏడీఆర్) సోమవారం తన నివేదికలో వెల్లడించింది. రూ.1225.11 కోట్లతో కాంగ్రెస్ పార్టీ రెండోస్థానంలో నిలిచింది. హస్తం పార్టీ గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 170.82 శాతం పెరుగుదలతో 772.74 కోట్లు ఎక్కువ విరాళాలు పొందింది. ఆ తర్వాత రూ.167.63 కోట్లతో సీపీఐ(ఎం), రూ.64.77 కోట్లతో బీఎస్పీ, రూ.22.68 కోట్లతో ఆప్, రూ.22.44 లక్షలతో ఎన్పీపీ వరుసగా నిలిచాయి.
బీజేపీ ఖర్చులు 50 శాతమే..
బీజేపీ తన ఆదాయంలో రూ.2,211.69 కోట్లు (50.96 శాతం) వ్యయం చేయగా.. కాంగ్రెస్ పార్టీ రూ.1025.24 కోట్లు (83.69 శాతం) ఖర్చు చేసినట్టు ఏడీఆర్ తెలిపింది. సీపీఐ (ఎం) రూ.127.28 కోట్లు (75.93 శాతం), బీఎస్పీ రూ.43.18 కోట్లు (66.67 శాతం) ఖర్చు చేశాయి. ఆప్, ఎన్పీపీ తమ ఆదాయానికి మించి ఖర్చులు చేసినట్టు ఏడీఆర్ నివేదించింది. ఆప్ రూ.34.09 కోట్లు ఖర్చు చేసింది. జాతీయ పార్టీలకు ఎలక్టోరల్ బాండ్ల రూపంలో ఎక్కువ ఆదాయం సమకూరింది. బీజేపీకి రూ.3,967.14 కోట్లు, కాంగ్రెస్ రూ.1,129.66 కోట్లు, సీపీఐ (ఎం) రూ.74.68 కోట్లు, ఆప్ రూ.22.13 కోట్లు పొందాయి.
బీజేపీ ఆదాయం లో భారీ పెరుగుదల
2023-24 ఆర్థిక సంవత్సరంలో బీజేపీ యొక్క ఆదాయం గణనీయంగా పెరిగింది. 83.85 శాతం పెరిగిన ఆదాయం, దేశంలోని రాజకీయ చరిత్రలో క్షేత్రస్థాయి విరాళాల విషయంలో ప్రభావవంతమైన మార్పులను చాటిచెప్పింది. 4,340.47 కోట్ల రూపాయలు పొందిన బీజేపీ, ఈ స్థాయిలో ఆదాయం సమకూర్చుకోవడం ఇతర జాతీయ పార్టీలకు కూడా సంకేతాన్ని ఇచ్చింది. భారతదేశంలో రాజకీయ పార్టీలు విరాళాలను సమకూర్చే పద్ధతులపై పారదర్శకత పెరిగినప్పటికీ, భారీగా పెరిగిన డొనేషన్లకు ఉన్న కారణాలు ఇంకా అనేక చర్చలకు దారితీస్తున్నాయి.