- సీఎం అభ్యర్థిని ఖరారు చేయలేదని ఎద్దేవా
బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కూడా ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించలేకపోవడం దాని వైఫల్యాన్ని చూపిస్తున్నది అని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత అతిషి విమర్శించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడి పది రోజులు గడిచినా, బీజేపీ ఇప్పటికీ సీఎం అభ్యర్థిని ఖరారు చేయలేదని ఆమె ఎద్దేవా చేశారు. ప్రభుత్వాన్ని నడిపించే సామర్థ్యం ఉన్న నేతలు బీజేపీలో లేరనేందునే ఇంకా నిర్ణయం తీసుకోలేకపోతున్నారని ఆమె వ్యాఖ్యానించారు.

బీజేపీ గెలిచిన 48 మంది ఎమ్మెల్యేలలో ఒక్కరిపై కూడా ప్రధాని నరేంద్ర మోదీకి నమ్మకం లేదని అతిషి ఆరోపించారు. దేశ రాజధానిలోనే ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి నిస్సహాయంగా మారిన పార్టీ ఇక ప్రజల అభివృద్ధి కోసం ఎలా పనిచేస్తుందని ఆమె ప్రశ్నించారు. ఢిల్లీ ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించి, త్వరలో సీఎం పేరును ప్రకటించాలని ఆమె డిమాండ్ చేశారు.
ఇదిలా ఉండగా, ఈ నెల 20న కొత్త ప్రభుత్వం కొలువుదీరనుందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. బీజేపీ తన అభ్యర్థిని ఖరారు చేసేందుకు అంత టైమ్ ఎందుకు తీసుకుంటోందన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఢిల్లీ రాజకీయాల్లో ఈ అస్పష్టత కొనసాగుతున్న వేళ, ఆమ్ ఆద్మీ పార్టీ బీజేపీపై తన దాడిని ముమ్మరం చేసింది.