BJP big shock for Kejriwal in early trends

Delhi Election Results: ఎర్లీ ట్రెండ్స్‌లో కేజ్రీవాల్‌కు బీజేపీ బిగ్ షాక్ !

న్యూఢిల్లీ: దేశ రాజధానిని పాలించేది ఎవరు..? నాలుగోసారి కూడా ఆమ్ ఆద్మీ పార్టీనే ఢిల్లీని ఏలుతుందా.. లేక ఢిల్లీని బీజేపీ కైవసం చేసుకుంటుందా..?ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో ఏం తేలబోతోంది..? క్షణ క్షణం ఉత్కంఠ రేపుతోన్న ఢిల్లీ ఎన్నికల ఫలితాల అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తోంది వార్త..

Advertisements

ఉదయం 8:18 గంటలకు ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ 15 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, అధికార పార్టీ ఆప్ 5 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ ఖాతా తెరవలేదు. అరవింద్ కేజ్రీవాల్‌ను నాలుగోసారి గెలిపిస్తారా లేదా అని ఉత్కంఠ నెలకొంది. న్యూఢిల్లీ నియోజకవర్గంలో కేజ్రీవాల్ కు బీజేపీ, కాంగ్రెస్ నుంచి గట్టిపోటీదారులు ఉన్నారు. బీజేపీ నుంచి పర్వేష్ వర్మ తనదే విజయమని ధీమాగా ఉన్నారు. లేక ఢిల్లీ ప్రజలు మాజీ సీఎం షీలా దీక్షిత్ వారసుడివైపు మొగ్గు చూపుతారా అని భావిస్తున్నారు. షీలా దీక్షిత్ కుమారుడు సందీప్ దీక్షిత్ ను ప్రజలు గెలిపిస్తారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. న్యూఢిల్లీ నియోజకవర్గంలో 56.41 శాతం ఓటింగ్ మాత్రమే నమోదైంది.

image

8.30 గంటలకు గమనిస్తే బీజేపీ 31 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, ఆప్ 21 స్థానాల్లో ముందంజలో ఉంది. ఓ చోట కాంగ్రెస్ అధిక్యంలో ఉన్నట్లు తెలుస్తోంది. అధికార ఆప్ పుంజుకుంది. 9 గంటల సమయానికి చూస్తే ఆమ్ ఆద్మీ పార్టీ 29 స్థానాల్లో, బీజేపీ 27 స్థానాల్లో ముందుంజలో ఉన్నాయి. దాంతో ఢిల్లీ ఎన్నికల్లో ఆధిక్యం క్రమంగా మారుతోంది. బీజేపీ, ఆప్ నువ్వానేనా అన్నట్లుగా ఫలితాలలో ఫైట్ చేస్తున్నాయి. ఎర్లీ ట్రెండ్స్ తో బీజేపీలో ఆశలు చిగురించాయి.

ఢిల్లీ అసెంబ్లీలో మొత్తం 70 స్థానాలు ఉన్నాయి. కనీస మెజార్టీ 36 సీట్లు వస్తే ప్రభుత్వం ఏర్పాటు చేయవచ్చు. ఫిబ్రవరి 5న ఒకే దశలో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 60.54 ఓటింగ్ నమోదైంది. బీజేపీ గెలిచే అవకాశాలున్నట్లు దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్‌ అంచనా వేశాయి. తాము నాలుగోసారి గెలుస్తామని ఆప్ చెబుతోంది. 2013 చివరి నుంచి ఢిల్లీలో ఆమ్‌ఆద్మీ పార్టీ అధికారంలో ఉంది.

Related Posts
Mithun Reddy : ఏప్రిల్ 3 వరకు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయవద్దన్న హైకోర్టు
Mithun Reddy ఏప్రిల్ 3 వరకు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయవద్దన్న హైకోర్టు

Mithun Reddy : ఏప్రిల్ 3 వరకు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయవద్దన్న హైకోర్టు ఆంధ్రప్రదేశ్‌లో లిక్కర్ కుంభకోణంపై చర్చలు మిన్నంటుతున్నాయి. ముఖ్యంగా వైసీపీ హయాంలో మద్యం Read more

Ex-Karnataka Police Chief : భార్యే హత్య చేసి ఉండొచ్చని పోలీసులు అనుమానం
DGP Om Prakash murdered

కర్ణాటక రాష్ట్రానికి మాజీ డీజీపీగా పని చేసిన ఓం ప్రకాశ్ దారుణ హత్యకు గురయ్యారు. బెంగళూరులోని ఆయన నివాసంలో రక్తపు మడుగులో ఆయన మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. Read more

సైఫ్ అలీ ఖాన్ దాడిపై సంచలన నిజాలు.
సైఫ్ అలీ ఖాన్ దాడిపై సంచలన నిజాలు.

సైఫ్ అలీఖాన్‌పై దాడి కేసులో ప్రధాన నిందితుడి అరెస్ట్: సంచలన నిజాలు వెలుగు బాలీవుడ్ ప్రముఖ నటుడు సైఫ్ అలీఖాన్‌పై కత్తితో దాడి చేసిన ఘటనకు సంబంధించి Read more

International Cricket : అంతర్జాతీయ క్రికెట్లో కొత్త రూల్స్!
International Cricket

అంతర్జాతీయ క్రికెట్‌లో త్వరలో కొన్ని కొత్త నిబంధనలు అమలులోకి వచ్చే అవకాశముంది. క్రికెట్‌లో మెరుగైన సమతుల్యత, పోటీ పరంగా మరింత ఉత్కంఠను సృష్టించే దిశగా ఈ మార్పులు Read more

×