లోక్ సభలో బీజేపీ విప్ గా కొండా విశ్వేశ్వర్ రెడ్డి

లోక్ సభలో బీజేపీ విప్ గా చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డిని ఆ పార్టీ హైకమాండ్ నియమించింది. ఆయనతోపాటు మరో 16 మందిని విప్ లను ఎంపిక చేసింది. లోక్ సభలో చీఫ్ విప్ గా డాక్టర్ సంజయ్ జైస్వాల్ నియమితులయ్యారు. విప్ లుగా ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డితో పాటు మరో 15 మందిని నియమించారు. ఈ మేరకు బీజేపీ పార్లమెంటరీ పార్టీ కార్యాలయం నుంచి ఓ ప్రకటన విడుదలైంది.

విప్‌లుగా నియమింతులైన వారు వీరే ..

కొండా విశ్వేశ్వర్ రెడ్డి,
స్మిత ఉదయ్ వాఘ్,
ఖగెన్ ముర్ము,
దిలీప్ సైకియా,
శశాంక్ మణి,
గోపాల్ జీ ఠాకూర్,
సతీశ్ కుమార్ గౌతమ్,
సంతోష్ పాండే,
దామోదర్ అగర్వాల్,
కమల్జీత్ షెరావత్,
అనంత నాయక్,
ధావల్ లక్ష్మణ్ బాయి పటేల్,
సుధీర్ గుప్తా,
కోట శ్రీనివాస్ పూజారి,
దేవుసిన్హ్ చౌహాన్,
జుగల్ కిశోర్ శర్మ.