Bihar: బాలికను పెళ్లి చేసుకున్న ముగ్గురు పిల్లల తల్లి..ఎక్కడంటే?

Bihar: బాలికను పెళ్లి చేసుకున్న ముగ్గురు పిల్లల తల్లి..ఎక్కడంటే?

బీహార్ రాష్ట్రంలోని దర్బాంగా జిల్లాలో ఒక సంచలన ఘటన చోటుచేసుకుంది. ముగ్గురు పిల్లల తల్లయిన ఓ మహిళ బాలికను పెళ్లి చేసుకుని పరారైంది. ఈ సంఘటన పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ మహిళ పేరు కృతీదేవి, బాలికతో ఏర్పడిన అనుబంధం ఆమె జీవితంలో నూతన మలుపులు తీసుకువచ్చింది. కృతీదేవి, కృష్ణ 11 సంవత్సరాలు క్రితం వివాహం చేసుకున్నారు. కృష్ణ రాజస్థాన్‌లో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. అయితే, పటాహీ గ్రామానికి చెందిన బాలికతో ఫోన్‌ ద్వారా ఏర్పడిన పరిచయం ఇద్దరి మధ్య అనుబంధానికి కారణమైంది. కృతీదేవి తరచూ బాలికతో మాట్లాడుతుండటంతో, కృష్ణ ఆమెను వారించాడని, అయినప్పటికీ వినిపించుకోలేదని, అవసరమైతే తనను విడిచి వెళ్లిపోతాను కానీ, తన గాళ్ ఫ్రెండ్‌ను విడిచిపెట్టే ప్రసక్తే లేదని తనను బెదిరించిందని కృష్ణ పోలీసులకు తెలిపాడు. 

Advertisements

ఊహించని పరిచయం:

పటాహీ గ్రామానికి చెందిన బాలికతో కృతీదేవి ఫోన్‌ ద్వారా పరిచయమైంది. ఆ పరిచయమే తర్వాత ఇద్దరి మధ్య అనుబంధానికి కారణమైంది. కృతీదేవి, ఆమె భర్త కృష్ణ , బాలిక ముగ్గురూ ఓ గదిలో అభ్యంతకరంగా ఉండగా కనుగొన్నట్టు పోలీసులు చెప్పారు.

పరారైన బాలిక:

ఈ క్రమంలో ఈ నెల 6వ తేదీన బాలిక అదృశ్యమైంది. అని ఆమె కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో, పోలీసులు ఈ విషయం గమనించి విచారణ ప్రారంభించారు. పోలీసులు కథనం ప్రకారం, కృతీదేవి బాలికను వివాహం చేసుకొని రాజస్థాన్ తీసుకెళ్లినట్లు తెలిసింది. విషయం తెలిసిన కృతీదేవి భర్త కృష్ణ ఆమెపై చేయిచేసుకున్నాడు. అయితే, బాలికతో ఆమెకు ఉన్న సంబంధాన్ని మాత్రం తెంచలేకపోయాడు.

పోలీసుల చర్యలు:

కిడ్నాప్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు శనివారం ముగ్గురినీ కృతీదేవి, కృష్ణ మరియు బాలికను అరెస్టు చేశారు. కోర్టు వారు కృతీదేవి, కృష్ణను జుడీషియల్ కస్టడీకి పంపించారు. బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం, ఆమెను కుటుంబ సభ్యులకు అప్పగించారు. బాలిక కుటుంబ సభ్యులు మాట్లాడుతూ, వారు కృతీదేవిని తమ కుమార్తెను మరదలుగా భావించి నమ్మారని తెలిపారు. అయితే, వారి మధ్య ఉన్న సంబంధం వెలుగులోకి వచ్చిన తరువాత, వారు నిర్ఘాంతపోయారు. భారతీయ చట్టాల ప్రకారం, మైనర్‌ ను పెళ్లి చేసుకోవడం చట్ట విరుద్ధం. ఈ క్రమంలో బాల్య వివాహాల నిషేధిత చట్టం, పోక్సో చట్టం కింద కృతీదేవిపై చర్యలు తీసుకోవడానికి పోలీసులు సిద్ధమవుతున్నారు.

Read also: Pahalgam Attack: పరోక్ష యుద్ధంతో వణికిపోతున్న పాకిస్తాన్‌..అగ్రదేశాలన్నీ భారత్‌కు మద్దతు

Related Posts
నేటి నుండి ప్రారంభమైన నాగార్జున సాగర్ టు శ్రీశైలం లాంచ్ ప్రయాణం
Nagarjuna Sagar to Srisailam launch journey started from today

హైదరాబాద్‌: తెలంగాణ పర్యాటక శాఖ కృష్ణా నదిలో జల విహారానికి సిద్ధమైంది. ఈ మేరకు ప్రయాణికుల కోసం టూర్ ప్యాకేజీలను అందుబాటులోకి తెచ్చారు. ఈ నేపథ్యంలోనే రోజు Read more

చిరంజీవి-అనిల్ రావిపూడి మూవీ షూటింగ్ ఎప్పుడంటే?
chiru anil

మెగాస్టార్ చిరంజీవి, హిట్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో రాబోతున్న సినిమాపై సినీ అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా Read more

నాలెడ్జ్ హబ్‌గా ఏపీని నిలపడమే లక్ష్యం – సీఎం చంద్రబాబు
The aim is to make AP a kno

విశాఖపట్నం : అత్యాధునిక సాంకేతికత – ఇన్నోవేషన్‌ అభివృద్ధికి దోహదం చేస్తాయని, ఈ విషయంలో ముందుండాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్‌ను నాలెడ్జ్ హబ్‌గా నిలిపాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్టు ముఖ్యమంత్రి Read more

నాగ పౌర్ణమి సందర్బంగా కోట్ల మంది భక్తులు
నేటితో ముగియనున్న కుంభమేళ పుణ్యస్నానాలు

మహా కుంభ మేళా 2025 వైభవంగా కొనసాగుతోంది. ప్రయాగ్‌రాజ్‌లో పండగ వాతావరణం నెలకొంది. దేశం నలుమూలల నుంచీ వస్తోన్న కోట్లాది మంది భక్తులు ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌ వద్ద Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×