బీహార్ రాష్ట్రంలోని దర్బాంగా జిల్లాలో ఒక సంచలన ఘటన చోటుచేసుకుంది. ముగ్గురు పిల్లల తల్లయిన ఓ మహిళ బాలికను పెళ్లి చేసుకుని పరారైంది. ఈ సంఘటన పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ మహిళ పేరు కృతీదేవి, బాలికతో ఏర్పడిన అనుబంధం ఆమె జీవితంలో నూతన మలుపులు తీసుకువచ్చింది. కృతీదేవి, కృష్ణ 11 సంవత్సరాలు క్రితం వివాహం చేసుకున్నారు. కృష్ణ రాజస్థాన్లో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. అయితే, పటాహీ గ్రామానికి చెందిన బాలికతో ఫోన్ ద్వారా ఏర్పడిన పరిచయం ఇద్దరి మధ్య అనుబంధానికి కారణమైంది. కృతీదేవి తరచూ బాలికతో మాట్లాడుతుండటంతో, కృష్ణ ఆమెను వారించాడని, అయినప్పటికీ వినిపించుకోలేదని, అవసరమైతే తనను విడిచి వెళ్లిపోతాను కానీ, తన గాళ్ ఫ్రెండ్ను విడిచిపెట్టే ప్రసక్తే లేదని తనను బెదిరించిందని కృష్ణ పోలీసులకు తెలిపాడు.
ఊహించని పరిచయం:
పటాహీ గ్రామానికి చెందిన బాలికతో కృతీదేవి ఫోన్ ద్వారా పరిచయమైంది. ఆ పరిచయమే తర్వాత ఇద్దరి మధ్య అనుబంధానికి కారణమైంది. కృతీదేవి, ఆమె భర్త కృష్ణ , బాలిక ముగ్గురూ ఓ గదిలో అభ్యంతకరంగా ఉండగా కనుగొన్నట్టు పోలీసులు చెప్పారు.
పరారైన బాలిక:
ఈ క్రమంలో ఈ నెల 6వ తేదీన బాలిక అదృశ్యమైంది. అని ఆమె కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో, పోలీసులు ఈ విషయం గమనించి విచారణ ప్రారంభించారు. పోలీసులు కథనం ప్రకారం, కృతీదేవి బాలికను వివాహం చేసుకొని రాజస్థాన్ తీసుకెళ్లినట్లు తెలిసింది. విషయం తెలిసిన కృతీదేవి భర్త కృష్ణ ఆమెపై చేయిచేసుకున్నాడు. అయితే, బాలికతో ఆమెకు ఉన్న సంబంధాన్ని మాత్రం తెంచలేకపోయాడు.
పోలీసుల చర్యలు:
కిడ్నాప్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు శనివారం ముగ్గురినీ కృతీదేవి, కృష్ణ మరియు బాలికను అరెస్టు చేశారు. కోర్టు వారు కృతీదేవి, కృష్ణను జుడీషియల్ కస్టడీకి పంపించారు. బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం, ఆమెను కుటుంబ సభ్యులకు అప్పగించారు. బాలిక కుటుంబ సభ్యులు మాట్లాడుతూ, వారు కృతీదేవిని తమ కుమార్తెను మరదలుగా భావించి నమ్మారని తెలిపారు. అయితే, వారి మధ్య ఉన్న సంబంధం వెలుగులోకి వచ్చిన తరువాత, వారు నిర్ఘాంతపోయారు. భారతీయ చట్టాల ప్రకారం, మైనర్ ను పెళ్లి చేసుకోవడం చట్ట విరుద్ధం. ఈ క్రమంలో బాల్య వివాహాల నిషేధిత చట్టం, పోక్సో చట్టం కింద కృతీదేవిపై చర్యలు తీసుకోవడానికి పోలీసులు సిద్ధమవుతున్నారు.
Read also: Pahalgam Attack: పరోక్ష యుద్ధంతో వణికిపోతున్న పాకిస్తాన్..అగ్రదేశాలన్నీ భారత్కు మద్దతు