2025 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు అన్ని జట్లు తమ ప్రాక్టీస్ను పెంచడానికి తీవ్రంగా శ్రమిస్తున్నాయి కొన్ని జట్లు వన్డే మ్యాచ్లలో బిజీగా ఉండగా మరికొన్ని జట్లు టెస్ట్లతో ప్రాక్టీస్ చేస్తున్నాయి. ఈ క్రమంలో ఆస్ట్రేలియాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. గాయాల కారణంగా ఆస్ట్రేలియా జట్టులో నలుగురు కీలక ఆటగాళ్లు జట్టును వీడారు. ఇందులో ఒక ఆటగాడు వన్డే క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు.మొదటగా కెప్టెన్ పాట్ కమ్మిన్స్ గురించి చెప్పాలి. భారత్తో జరిగిన ఐదు టెస్ట్ల సిరీస్ ముగిసిన తర్వాత అతనికి చీలమండ గాయం అయినట్లు గుర్తించారు. ఈ గాయం నుంచి పూర్తిగా కోలుకోలేకపోయిన కమ్మిన్స్ 2025 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి పూర్తిగా దూరంగా ఉన్నాడు.ఇంకా ఫాస్ట్ బౌలర్ జోష్ హాజిల్వుడ్ కూడా గాయాలతో బాధపడుతున్నాడు.

భారత్తో జరిగిన సిరీస్ సమయంలో అతనికి కాఫ్ సమస్య ఏర్పడింది. ఆ తరువాత తుంటి గాయం కారణంగా అతను జట్టుకు దూరంగా ఉన్నాడు.ఆస్ట్రేలియా జట్టు మరో కీలక ఆటగాడు మిచెల్ మార్ష్ కూడా 2025 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి దూరంగా ఉండబోతున్నాడు. అతని పేరు లిస్ట్ నుంచి తొలగించారు. సెలెక్టర్ జార్జ్ బెయిలీ కూడా ఈ విషయాన్ని ధృవీకరించారు. ఇంకా ఆస్ట్రేలియాకు చెందిన మరో ఆటగాడు మార్కస్ స్టోయినిస్ కూడా ఆకస్మాత్తుగా వన్డే క్రికెట్ నుంచి రిటైర్ అయిపోయాడు. అతనికి 2025 ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక అయినప్పటికీ ఇప్పుడు అతని స్థానంలో కొత్త ఆటగాడిని తీసుకోవాల్సి ఉంటుంది.
కానీ స్టోయినిస్ T20 అంతర్జాతీయ క్రికెట్లో ఆడడం కొనసాగిస్తున్నారు ఇప్పుడు పాట్ కమ్మిన్స్ మరియు జోష్ హాజిల్వుడ్ స్థానాలను భర్తీ చేసే అవకాశం సీన్ అబాట్ మరియు స్పెన్సర్ జాన్సన్కు ఉంది. బ్యూ వెబ్స్టర్ కూడా ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్గా జట్టులో చోటు సంపాదించడానికి ముందున్నాడు. ఆస్ట్రేలియా జట్టు 2025 ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు శ్రీలంకలో రెండు వన్డే మ్యాచ్ల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్లో పాట్ కమ్మిన్స్ స్థానంలో స్టీవ్ స్మిత్ లేదా ట్రావిస్ హెడ్ను వన్డే కెప్టెన్గా నియమించవచ్చు.ఈ విధంగా ఆస్ట్రేలియా జట్టు భారీ మార్పులతో 2025 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి సన్నద్ధం అవుతుంది.