అయోధ్యలో పెద్ద ఎత్తున భూ కుంభకోణం: అఖిలేశ్‌

akhilesh-yadav

లక్నో : శ్రీరామ జన్మభూమి అయోధ్యలో పెద్ద ఎత్తున భూ కుంభకోణం జరిగిందని సమాజ్‌వాదీ పార్టీ చీఫ్‌ అఖిలేశ్‌ యాదవ్‌ ఆరోపించారు. ఆయన ఆ పార్టీ అయోధ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ.. అధికారంలో ఉన్నవారు విస్తృత స్థాయిలో అవినీతికి పాల్పడ్డారని, అందులో భాగమే భూమికి సంబంధించిన దోపిడీలని చెప్పారు. బీజేపీ నేతలు, అధికారులు భూ దోపిడీలకు పాల్పడ్డారన్నారు. ఈ చీకటి వాస్తవాలను బయటపెట్టినందుకు సమాజ్‌వాదీ పార్టీ కార్యకర్తలను అభినందించారు. అయోధ్య వంటి పవిత్రమైన స్థలంలోనే ఇటువంటి ఆక్రమణలకు పాల్పడ్డవారు, మిగతా జిల్లాల్లో ఇంకెన్ని దారుణాలకు పాల్పడి ఉంటారో ఊహించుకోవచ్చునని తెలిపారు. అయోధ్య అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదని అన్నారు.