సెక్రటేరియట్ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ

హైదరాబాద్‌లోని సెక్రటేరియట్ ప్రాంగణంలో ఏర్పాటు చేయ‌నున్న తెలంగాణ తల్లి విగ్రహ స్థ‌లంలో ఆయ‌న నేడు లాంచ‌నంగా భూమి పూజ చేశారు. ఈ సందర్బంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..తెలంగాణ ఏర్పాటు ప్ర‌క్రియ ప్రారంభ‌మైంద‌ని 2009, డిసెంబ‌రు 9న మ‌న్మోహ‌న్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింద‌ని, అదే రోజు తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ జ‌న్మ‌దినం కావ‌డంతో తెలంగాణ త‌ల్లి విగ్ర‌హాన్ని డిసెంబర్ 9న ఆవిష్కరిస్తామ‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.

తెలంగాణ ప్రజలకు డిసెంబర్ 9 ఒక పండగ రోజు అని ముఖ్య‌మంత్రి అన్నారు. విగ్ర‌హావిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మాన్ని ఘ‌నంగా నిర్వ‌హిస్తామ‌ని ముఖ్య‌మంత్రి ప్ర‌క‌టించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. సచివాలయ భవన ప్రధాన ద్వారం సమీపంలో విగ్రహం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.