హత్రాస్ తొక్కిసలాట..విధిరాత అంటున్న భోలేబాబా

ఉత్తరప్రదేశ్ హత్రాస్ జిల్లాలో భోలే బాబా సత్సంగం సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 121 మంది మరణించిన సంగతి తెలిసిందే. బాబా సత్సంగ్ కార్యక్రమానికి రాష్ట్రంలోని నలుమూలల నుంచి భారీగా భక్తులు తరలివచ్చారు. ఈ క్రమంలో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాట ఘటన ఫై పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. ఈ ఘటన ఫై మరోసారి భోలేబాబా స్పందించారు.

తొక్కిసలాట లో 121 మంది ప్రాణాలు కోల్పోవడంపై విచారం వ్యక్తం చేస్తూనే.. మరణం అనివార్యమని, విధిరాతను ఎవరూ తప్పించలేరని పేర్కొన్నారు. ముందో, వెనకో ప్రతి ఒక్కరు తప్పక మరణించాల్సిందేనని తేల్చి పారేశారు. కొందరు వ్యక్తులు తమ సంస్థ నిర్వహిస్తున్నఆధ్యాత్మిక విధానాల పరువు తీసేందుకు ప్రయత్నిస్తున్నారని, అందులో భాగంగానే తొక్కిసలాట జరిగిందని భోలే బాబా పేర్కొన్నారు.