ప్రజా భవన్ లో బిసి నేతల సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు స్పీచ్ పాయింట్స్

ప్రజా భవన్ లో బిసి నేతల సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు స్పీచ్ పాయింట్స్

ప్రజా భవన్ లో బిసి నేతల సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు స్పీచ్ పాయింట్స్

తెలంగాణ ప్రభుత్వ బీసీ జన గణనపై స్పష్టత

కాంగ్రెస్ పార్టీ ద్వారానే సామాజిక న్యాయం జరుగుతుందని ప్రతి ఇంటికి ప్రచారం చేయండి

Advertisements

ఈ దేశంలో ఇప్పటివరకు బీసీ జన గణన సైంటిఫిక్ గా తేల్చలేదు.. మొదటిసారి తేల్చింది తెలంగాణ ప్రభుత్వమే

రాష్ట్ర ప్రభుత్వం చేసిన బీసి జన గణనను ఏ సర్వే తోనూ పోల్చలేరు.

2011లో జరిగిన జన గణన లో కేవలం ఎస్సీ, ఎస్టీ, ఇతర జనాభా లెక్కలే తేల్చారు

కెసిఆర్ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే అధికారికం కాదు. దానిని క్యాబినెట్లో పెట్టలేదు, శాసనసభలో చర్చకు పెట్టలేదు. కాబట్టి అది చెల్లుబాటు కాదు

దేశంలో మొదటిసారి బీసీ జనాభాను అధికారికంగా లెక్క తేల్చి ముద్ర వేశాం. దీనిని ఆయా వర్గాల ప్రయోజనం కోసం ఎలా ముందుకు తీసుకువెళ్లాలనేది బీసీ ప్రజా ప్రతినిధులు, సంఘాలు ఆలోచన చేయాలి

బీసీ సర్వే అధికారికంగా జరగడం మూలంగా టిఆర్ఎస్ కు నష్టం. కాబట్టి సర్వే బాగాలేదని ప్రచారం చేసి బీసీ లబ్ధిదారులకు ప్రయోజనం దక్కకుండా ఆ పార్టీ రాజకీయం చేస్తుంది.

తెలంగాణలో బీసీ సర్వే విజయవంతం అయితే దేశవ్యాప్తంగా చేయాల్సి వస్తుంది. బిజెపి పై ఒత్తిడి పెరుగుతుందని ఆ పార్టీ నేతలు సర్వేపై దుష్ప్రచారం చేస్తున్నారు.

సీఎం రేవంత్ రెడ్డి పై ఒత్తిడి ఉన్నప్పటికీ. రాహుల్ గాంధీ నా నాయకుడు ఆయన ఏ జెండానే నా ఎజెండా. నాకు వచ్చిన ఉద్యోగాన్ని సామాజిక న్యాయం చేయడానికి ఉపయోగిస్తా అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్పారు. వారికి నా అభినందనలు. సర్వే పారదర్శకంగా జరగాలని, ఈ అంశాన్ని సీరియస్గా తీసుకోవాలని, ఎక్కడ రాజీ పడవద్దని ప్రణాళిక శాఖ చూస్తున్న నాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పారు.

సర్వేపై ఎవరు ఏ ప్రశ్న అడిగినా అధికారికంగా సమాధానం ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అన్ని ఆధారాలు అధికారికంగా నిక్షిప్తం చేశాం. 8 కోట్ల పేజీలకు పైబడిన సమాచారం సర్వే ద్వారా సేకరించాం

Related Posts
మరోసారి నాంపల్లి కోర్టుకు అల్లు అర్జున్
Allu Arjun to Nampally court once again

హైదరాబాద్‌: టాలీవుడ్ నటుడు, పుష్ప 2 హీరో అల్లు అర్జున్ నాంపల్లి కోర్టులో హాజరవుతున్నారు. ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్య 70ఎంఎం థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనలో Read more

అల్లు అర్జున్ బెయిల్ డిసెంబర్ 30కి వాయిదా!
అల్లు అర్జున్ బెయిల్ డిసెంబర్ 30కి వాయిదా!

తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ బెయిల్ విచారణ డిసెంబర్ 30కి వాయిదా పడింది పుష్ప 2 తొక్కిసలాట కేసులో నటుడు అల్లు అర్జున్‌కు సంబంధించి, వర్చువల్‌గా హాజరైన Read more

గురుకుల బాట సందర్శనలో ఉద్రిక్తత – బీఆర్ఎస్ నేతల అరెస్టు
brs leaders arrest

తెలంగాణలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డి, కార్పొరేటర్లు రాధిక రెడ్డి, రవి నాయక్ ఆధ్వర్యంలో ఆశ్రమ పాఠశాలకు గురుకుల బాట సందర్శన నిమిత్తం వెళ్లే Read more

తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా దిల్ రాజు
DIl Raju

తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (టీఎఫ్‌డీసీ) చైర్మన్‌గా ప్రముఖ నిర్మాత దిల్ రాజు బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ఆయనను టీఎఫ్‌డీసీ చైర్మన్‌గా నియమిస్తూ ఉత్తర్వులు Read more

×