అమరావతిలో బసవతారకం ఆసుపత్రి – బాలయ్య

క్యాన్సర్ బాధితులకు ఉచితంగా వైద్యం అందిస్తోన్న బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ ఏపీలోనూ ఏర్పాటుకానుంది. అమరావతిలో బసవతారకం హాస్పిటల్ నిర్మించేందుకు గతంలోనే సీఎం చంద్రబాబు స్థలాన్ని కేటాయించినట్లు బాలయ్య తెలిపారు.

హాస్పిటల్ వార్షికోత్సవంలో బాలకృష్ణ మాట్లాడుతూ.. త్వరలో ఏపీలో కూడా బసవతారకం హాస్పిటల్ మొదలవుతుంది అని తెలిపారు. అమరావతిలో బసవతారకం హాస్పిటల్ పూర్తయితే ఏపీ నుంచి హైదరాబాద్ కి వచ్చే ఎంతోమంది పేద క్యాన్సర్ పేషంట్స్ కి ఊరట కలుగుతుంది. దీనిపై బాలయ్య అభిమానులతో పాటు అందరూ బాలయ్యని అభినందిస్తున్నారు.

ప్రాణాంతక క్యాన్సర్ వ్యాధికి చికిత్సకు అతి తక్కువ ఫీజులతో నాణ్యమైన చికిత్స అందించే ప్రముఖ బసవతారకం ఆస్పత్రి ప్రస్తుతం హైదరాబాద్ బంజారాహిల్స్‌లో ఉంది. క్యాన్సర్ కు నాణ్యమైన చికిత్స అందించడంలో బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఎంతో పేరు సంపాదించిది. హైదరాబాద్ లో దీన్ని 22 జూన్ 2000న ప్రారంభించారు. ఇది నందమూరి బసవ తారక రామారావు మెమోరియల్ క్యాన్సర్ ఫౌండేషన్, ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆర్గనైజేషన్ ఉమ్మడి సహకారంతో ఈ సంస్థ నడుస్తోంది.

మెడికల్ ఆంకాలజీ, సర్జికల్ ఆంకాలజీ, రేడియేషన్ ఆంకాలజీ, పెయిన్ అండ్ పాలియేటివ్ మెడిసిన్, ఓంకో అనస్థీషియా, ఆంకో పాథాలజీ, సోషల్ వెల్ఫేర్, లేబొరేటరీ మెడిసిన్ వంటి క్యాన్సర్ కేర్‌లో వివిధ ప్రత్యేకతలు బసవతారకం ఆస్పత్రిలో ఉన్నాయి. హైదరాబాద్ లోని ఆస్పత్రి దాదాపు 650 పడకల సామర్థ్యం కలిగి ఉంది. 2021 సంవత్సరంలో బెస్ట్ ఆంకాలజీ ఆసుపత్రుల్లో దేశంలోనే ఆరవ ఉత్తమ క్యాన్సర్ సెంటర్‌గా ర్యాంక్ పొందింది.