Bandi Sanjay Kumar

బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు!

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందని ముందు నుంచి ఊహించిందేనని అన్నారు. మేధావివర్గం అంతా బీజేపీకి ఓటు వేశారని తెలిపారు. తెలంగాణలో కూడా అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో జరుగుతున్న మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో విజయం సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని మేధావివర్గం, ఉద్యోగ, ఉపాధ్యాయులు ఆలోచించి ఓటు వేయాలని కోరారు. శాసనసభలో ప్రజా సమస్యలపై ప్రశ్నించేది బీజేపీ ఒక్కటేనని బండి సంజయ్ పేర్కొన్నారు. ఢిల్లీ ప్రజలు చీపురుతో ఆమ్ ఆద్మీ పార్టీని ఊడ్చేశారని విమర్శించారు. ప్రజాస్వామ్య బద్ధమైన పాలన ఢిల్లీ ప్రజలు కోరుకున్నారని చెప్పారు. ఇవాళ కరీంనగర్‌లో బీజేపీ పట్టభద్రుల సంకల్పయాత్ర జరిగింది. కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌ ఈ యాత్రలో పాల్గొన్నారు. బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు. అవినీతి, కుంభకోణాలు, జైలు పార్టీలు తమకు వద్దని ప్రజలు అనుకున్నారని బండి సంజయ్ తెలిపారు.

1293032 bandi sanjay kumar

Related Posts
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్
Delhi Assembly Election Notification Release

న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి శుక్రవారం ఎన్నికల కమిషన్‌ (ఇసి) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. నేటి నుండి నామినేషన్ల స్వీకరించనున్నట్లు ప్రకటించింది. ఈ నెల 17వ Read more

నల్లబెల్లి మండలంలో పెద్దపులి సంచారం
nallabelli

వ్యవసాయ పనుల కోసం వెళ్లిన రైతులు, కూలిలకు ఆ వ్యవసాయ భూమిలో ఏదో అడవి జంతువు పాదముద్రలు కనిపించడం తో అందులో కొంత మంది రైతులు పెద్దపులి Read more

టీడీపీ క్రమశిక్షణ కమిటీ ఎదుట ఎమ్మెల్యే కొలికపూడి
MLA Kolikapudi appeared before TDP Disciplinary Committee

అమరావతి: టీడీపీ క్రమశిక్షణా కమిటీ ఎదుట ఎన్టీఆర్ జిల్లా తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఈరోజు హాజరయ్యారు. ఈనెల 11న తిరువూరు నియోజకవర్గంలో ఎస్టీ కుటుంబంపై Read more

Crime :ఇన్స్టాగ్రామ్ పరిచయమే..ఇద్దరు బాలికలపై అఘాయిత్యం
Crime :ఇన్స్టాగ్రామ్ పరిచయమే..ఇద్దరు బాలికలపై అఘాయిత్యం

ఇద్దరు బాలికలకు మాయమాటలు చెప్పి నమ్మించిన ఇద్దరు యువకులు వారిపై అత్యాచారానికి పాల్పడిన ఘటన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అల్వాల్ పరిధిలో సంచలనం రేపింది.ఆకుల సాత్విక్ (26) Read more