నోట్లో పేలిన బెలూన్- 8ఏళ్ల చిన్నారి మృతి

Balloon: నోట్లో పేలిన బెలూన్- 8ఏళ్ల చిన్నారి మృతి

బెలూన్ నోట్లో పేలిపోవడం వల్ల ఓ 8 ఏళ్ల బాలిక మరణించింది. బెలూన్​కు గాలిని ఊదుతుండగా అకస్మాత్తుగా పేలిపోయింది. బెలూన్​లోని ఓ ముక్క చిన్నారి గొంతులో ఇరుక్కుపోవడం వల్ల ఊపిరాడక ప్రాణాలు విడిచింది. ఈ విషాద ఘటన మహారాష్ట్రలో జరిగింది. సరదాగా ఆడుకుంటున్న బాలిక మరణించడం వల్ల ఆమె కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

Advertisements
 నోట్లో పేలిన బెలూన్- 8ఏళ్ల చిన్నారి మృతి

పిల్లలతో కలిసి సరదాగా బెలూన్లను ఊదుతుండగా ఈ ప్రమాదం
ధూలే నగరంలోని యశ్వంత్ నగర్​లోని సక్రి రోడ్‌ సమీపంలో డింపుల్ మనోహర్ వాంఖడే అనే బాలిక ఈ ఘటనలో ప్రాణాలు విడిచింది. పిల్లలతో కలిసి సరదాగా బెలూన్లను ఊదుతుండగా ఈ ప్రమాదం జరిగింది. చిన్నారి స్పృహతప్పి పడిపోయిన విషయాన్ని తోటి స్నేహితులు ఆమె కుటుంబ సభ్యులకు చెప్పారు. హుటాహుటినవారు ఓ ప్రైవేట్ వాహనంలో బాలికను జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లారు. చిన్నారిని పరీక్షించిన వైద్యులు, ఆమె అప్పటికే మరణించినట్లు ధ్రువీకరించారు.
మరో ఘటనలో పాలకుండలో పడి మూడేళ్ల చిన్నారి మృతి
రాజస్థాన్​లో మరుగుతున్న పాలకుండలో ప్రమాదవశాత్తు పడి మూడేళ్ల చిన్నారి మృతి చెందింది. డీగ్ జిల్లాలో బుధవారం రాత్రి జరిగిందీ దుర్ఘటన.

మంగళవారం సాయంత్రం సారిక(3) ఇంటి పైకప్పుపై ఉన్న పిల్లిని చూసి భయపడింది. ఈ క్రమంలో పారిపోయేందుకు ప్రయత్నించింది. పరిగెడుతూ వెళ్తుండగా, స్టవ్ దగ్గర ఉంచిన వేడి పాలు ఉన్న పాత్రలో పడిపోయింది. దీంతో చిన్నారికి తీవ్ర కాలిన గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు వెంటనే బాధితురాల్ని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం భరత్​పుర్​కు, ఆపై జయపురకు తరలించారు. అక్కడ కాలిన గాయాలకు చికిత్స పొందుతూ చిన్నారి బుధవారం రాత్రి ప్రాణాలు విడిచింది.

Related Posts
ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి నైజీరియా నుండి గౌరవం
nigeria

నైజీరియా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది నైజీరియా (GCON) అవార్డుతో సత్కరించనున్నది. ఈ గౌరవం, 1969లో క్వీన్ ఎలిజబెత్ Read more

శ్వేత విప్లవ పితామహుడిని స్మరించుకుంటూ జాతీయ పాల దినోత్సవం..
verghese kurien

ప్రతి సంవత్సరం నవంబర్ 26 న భారతదేశంలో నేషనల్ మిల్క్ డేను సెలబ్రేట్ చేయడం, పాలు మరియు పాల పరిశ్రమకు చేసిన అద్భుత కృషిని గుర్తించడానికి ప్రత్యేకమైన Read more

నేడు ఢిల్లీలో 101 మంది పంజాబీ రైతుల ర్యాలీ
101 Punjab farmers rally in Delhi today

న్యూఢిల్లీ: ఈరోజు మూడోసారి ఢిల్లీకి పంజాబీ రైతులు ర్యాలీ తీయ‌నున్నారు. శంభూ బోర్డ‌ర్ నుంచి 101 మంది రైతులు ఢిల్లీ వెళ్ల‌నున్నారు. పంట‌ల‌కు క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర Read more

మరోసారి విదేశీ పర్యటనకు వెళ్లనున్న ప్రధాని మోడీ
PM Modi will go on a foreign tour once again

న్యూఢిల్లీ: మరోసారి ప్రధాని మోడీ విదేశీ పర్యటనకు బయలుదేరి వెళ్లనున్నారు. ఈ పర్యటనలో భాగంగా రెండు రోజులు లావోస్‌లో మోడీ పర్యటించనున్నారు. అక్టోబర్ 10, 11 తేదీల్లో Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×