balayya speech daku

‘అఖండ 2’ తర్వాత నా విశ్వరూపం చూపిస్తా: బాలకృష్ణ

నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా డైరెక్టర్‌ బాబీ తెరకెక్కించిన చిత్రం డాకు మహారాజ్. సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12వ తేదిన ఆదివారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని యూసఫ్‌గూడ పోలీస్‌ గ్రౌండ్స్‌లో డాకు మహారాజ్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ గ్రాండ్‌గా జరిగింది. ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ మొదటగా ఏపీలో జరగాల్సి ఉంది. తిరుమల తొక్కిసలాటలో 6 మంది మృతి చెందిన కారణంగా ఈవెంట్ వాయిదా పడింది. ఆ వేదికను నిర్మాత హైదరాబాద్‌కు మార్చారు.

Advertisements

ఇక ఈ ఈవెంట్ లో బాలకృష్ణ మాట్లాడుతూ..’అఖండ 2′ మూవీ తర్వాత ఇండస్ట్రీకి తన విశ్వరూపం చూపిస్తానని సినీనటుడు నందమూరి బాలకృష్ణ అన్నారు. ఆ తర్వాత వచ్చే సినిమాలు చరిత్రలో నిలిచిపోతాయని చెప్పారు. ‘మా నాన్న, అభిమానులే నాకు ఇన్స్పిరేషన్. వారిచ్చిన ప్రోత్సాహంతోనే ఇలాంటి సినిమాలు చేస్తున్నా. సంక్రాంతికి రాబోయే ఈ సినిమా బ్లాక్బస్టర్గా నిలుస్తుంది’ అని ఆయన పేర్కొన్నారు. సినిమా కలెక్షన్లు, స్టార్ డమ్ వంటి వాటిని తాను పట్టించుకోనని బాలకృష్ణ అన్నారు. ఏం చూసి ఇంత పొగరు అని చాలా మంది అనుకుంటారని, తానే తన పొగరు, ధైర్యమని ఈవెంట్లో వెల్లడించారు. తన నమ్మకం, ఆలోచనలే ధైర్యమని, ఎవరితో పోల్చుకోనని స్పష్టం చేశారు. తన రూటే వేరని, మాట సూటిగా, బాట ముక్కు సూటిగా ఉంటుందన్నారు. ఒకరి కీర్తిని తాను మోయనని, తనను తాను మలుచుకున్న మహారాజ్ అని స్పీచ్ ఇచ్చారు. ఇక ఈ మూవీ ని సితార ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మించారు.

Related Posts
డిప్రెషన్‌తో కేపీ చౌదరి ఆత్మహత్య : పోలీసులు
KP Chowdary

తెలుగు సినీ నిర్మాత కెపి చౌదరి తన సూసైడ్ నోట్‌లో డిప్రెషన్ కారణంగానే తాను ఈ విపరీతమైన చర్య తీసుకున్నానని, తన మరణానికి ఎవరూ బాధ్యులు కాకూడదని Read more

Traffic Police : హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల కఠిన నిర్ణయం – మైనర్ల డ్రైవింగ్‌కు చెక్!
Traffic Police హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల కఠిన నిర్ణయం – మైనర్ల డ్రైవింగ్‌కు చెక్!

హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ నియంత్రణ కోసం పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు.ప్రత్యేకంగా మైనర్ల చేత వాహనాల నడిపింపును నియంత్రించేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నారు.ఇటీవల రోడ్డు ప్రమాదాల సంఖ్య Read more

PSR Anjaneyulu: సీఐడీ విచారణలో పీఎస్ఆర్ ఆంజ‌నేయులు
PSR Anjaneyulu: సీఐడీ విచారణలో పీఎస్ఆర్ ఆంజ‌నేయులు

విజయవాడ జైలులో మాజీ ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులు: సీఐడీ కస్టడీలో విచారణ ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ మరియు సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులు Read more

Civils: ఇంటర్ లో ఫెయిల్ అయ్యాడు.. అయితేనేం సివిల్స్ లో 988వ ర్యాంకు కొట్టాడు
Civils: ఇంటర్ లో ఫెయిల్ అయ్యాడు అయితేనేం సివిల్స్ 988వ ర్యాంకు కొట్టాడు

ఒకప్పుడు ఇంటర్మీడియట్‌లో ఫెయిల్ అయిన తెలుగు యువకుడు, ఇప్పుడు దేశ అత్యున్నత సర్వీసులలో ఒకటైన యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్‌లో 988వ ర్యాంకును సాధించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇతని Read more

Advertisements
×