హిందూపురంలో శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయం 85వ వార్షికోత్సవాన్ని ఘనంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. ఈ సందర్భం ఆలయ చరిత్రలో ఓ మైలురాయిగా నిలుస్తోంది. అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠకు 85 ఏళ్లు పూర్తయిన వేళ, ఆలయ కమిటీ, ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, హోమాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో వేడుకలు అద్భుతంగా జరుగుతున్నాయి.

బంగారు విగ్రహం
ఈ ఉత్సవాల్లో ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నది – అమ్మవారి కొత్త బంగారు విగ్రహం. సుమారు 2.5 కిలోల బంగారంతో, ₹3 కోట్ల వ్యయంతో ప్రత్యేకంగా తయారైన ఈ విగ్రహం ఆలయంలో ప్రతిష్ఠింపబడింది.
బాలకృష్ణ దంపతుల ఆవిష్కరణ
ఈ సందర్భంగా హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ తన సతీమణితో కలిసి అమ్మవారి బంగారు విగ్రహాన్ని ఆవిష్కరించారు. బంగారు పుష్పాలతో ప్రత్యేక పూజలు నిర్వహించి, అమ్మవారిని ఆరాధించారు. అనంతరం ఆలయ కమిటీ మరియు ఆర్యవైశ్య సంఘం వారు బాలకృష్ణ దంపతులకు ఘనంగా సత్కారం నిర్వహించారు. ఈ సందర్భంగా బాలయ్య మాట్లాడుతూ వాసవీ పరమేశ్వరి ఆశీస్సులతో హిందూపురం అభివృద్ధి మార్గంలో ముందుకు సాగుతోందన్నారు. మరోవైపు, అమ్మవారి బంగారు విగ్రహాన్ని దర్శించుకునేందుకు ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు.
Read also: YS Jagan: రైతుల పట్ల కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం జగన్