తమాషాలు చేస్తున్నారా అంటూ అధికారుల ఫై ఎమ్మెల్యే అయ్యన్న పాత్రుడు ఆగ్రహం

టీడీపీ ఎమ్మెల్యే మరోసారి వార్తల్లో నిలిచారు. నర్సీపట్నం మున్సిపల్ అధికారులపై అయ్యన్న పాత్రుడు ఆగ్రహం వ్యక్తం చేసారు. తమాషాలు చేస్తున్నారా ..? కళ్ళు మూసుకుపోయి ఏడుస్తున్నారా..? త్వరలో నేనే స్పీకర్ అవుతున్నా. మిమ్మల్ని అసెంబ్లీలో గంటలు కొద్ది నిలబెడతానంటూ వార్నింగ్ ఇచ్చారు.

అసలు ఏం జరిగిందంటే..

అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గంలోని ఆరిలోవ అటవీ ప్రాంతంలో ఆర్ అండ్ బి రోడ్డు, మున్సిపాలిటీ ఆర్ ఎం బి రోడ్లను సంబంధిత ఉన్నతాధికారులతో కలిసి అయ్యన్న పరిశీలించారు. ఈ సందర్భంగా రోడ్డు నాణ్యత పరిణామాలకై, క్వాలిటీ అధికారుల వద్ద నుంచి స్పష్టమైన వివరణ రాకపోవడంతో అయ్యన్న అసహనం వ్యక్తం చేశారు. ఎలక్షన్లలో ఓట్ల కోసం అర్థరాత్రి రోడ్డు పనులు చేశారు కదా అంటూ ఆర్ అండ్ బి అధికారులు నిలదీశారు.

2017 సంవత్సరంలో తాను R&B మంత్రిగా ఉన్నప్పుడు గొలుగొండ మండలం కృష్ణదేవిపేట నుండి నర్సీపట్నం మార్గంలో 26 కిలోమీటర్లకు ఒక్కొక్క కిలోమీటర్ కు కోటి రూపాయలు చొప్పున నిధులు విడుదల చేసినట్లు చెప్పారు. ఆ నిధులతో ఏడు సంవత్సరాలుగా ఆర్ఎం బి రోడ్డు పనులు జరుగుతున్నాయి. ఈరోజు పరిశీలించగా నాణ్యత పాటించకుండా అసంపూర్ణంగా సాగుతున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం అయ్యన్న వ్యాఖ్యలు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.