Atrocious incident in Tamil Nadu..A student was raped by a gang of teachers

తమిళనాడులో దారుణ ఘటన..విద్యార్థినిపై టీచర్ల గ్యాంగ్‌ రేప్‌

చెన్నై: తమిళనాడు రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. విద్యార్థులకు విద్యా బుద్ధులు నేర్పించి ఆదర్శంగా ఉండాల్సిన ఉపాధ్యాయులే కీచకులుగా మారారు. ఓ విద్యార్థినిపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ ఘటన కృష్ణగిరి జిల్లాలోని ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలో చోటు చేసుకుంది. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 13 ఏళ్ల విద్యార్థినిపై ముగ్గురు గురువులు సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. దీంతో అభంశుభం తెలియని ఆ బాలిక గర్భం దాల్చింది. ఈ విషయాన్ని బయటకు చెప్పుకోలేని అసహాయతలో ఉన్న బాలిక తల్లి.. ఆమెను నెలరోజుల పాటు స్కూలుకు సెలవు పెట్టించి అబార్షన్‌ కోసం ప్రయత్నిస్తున్న సమయంలో దారుణ ఘటన వెలుగు చూసింది.

image

బాలిక తల్లి చెప్పింది విని ఆగ్రహించిన ఆ హెడ్మాస్టర్‌.. వెంటనే శిశు సంక్షేమ అధికారులకు ఆమెతో ఫిర్యాదు చేయించారు. పాఠశాలలో పనిచేస్తున్న ఇద్దరు సెకండరీ గ్రేడ్‌ ఉపాధ్యాయులు, ఒక డిగ్రీ టీచర్‌ తనపై సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు బాలిక చెప్పింది. దీంతో శిశు సంక్షేమ సంరక్షణ అధికారులు బర్గూర్‌ మహిళా పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి, బాలికపై దారుణానికి ఒడిగట్టిన ఉపాధ్యాయులు చిన్నసామి(57), ఆర్ముగం(45), ప్రకాశ్‌(37)ను అరెస్ట్‌ చేశారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర నిరసనలకు దారి తీసింది.

సీఎం స్టాలిన్‌కు వ్యతిరేకంగా విద్యార్థి సంఘాలు నిరసన ప్రదర్శన చేశాయి. బాలికను కృష్ణగిరి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తమిళనాట వరుసగా అత్యాచార ఘటనలు స్టాలిన్‌ సర్కారును ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. గత ఏడాది డిసెంబరు 23న ప్రఖ్యాత అన్నామలై విశ్వవిద్యాలయానికి చెందిన విద్యార్థినిపై ఇద్దరు లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే.

Related Posts
హైదరాబాద్‌లో రైల్వే టెర్మినల్ ను ప్రారంభించనున్న మోదీ
హైదరాబాద్‌లో రైల్వే టెర్మినల్ ను ప్రారంభించనున్న మోదీ

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సోమవారం నాడు హైదరాబాద్ లోని చార్లపల్లి రైల్వే టెర్మినల్ ను వర్చువల్ మాధ్యమం ద్వారా ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ Read more

రసాయన శాస్త్రంలో ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్‌ బహుమతి
Nobel Prize in Chemistry for three scientists

స్టాక్‌హోం: రసాయన శాస్త్ర విభాగంలో 2024 సంవత్సరానికి నోబెల్ బహుమతిని ప్రకటించారు. రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రకారం.. ఈ సంవత్సరం ముగ్గురికి ఈ గౌరవం Read more

ఫ్రీ బస్సు రద్దు పై సీఎం క్లారిటీ
karnataka free bus

కర్ణాటక రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అందించే శక్తి పథకాన్ని పున:సమీక్షించే ఆలోచన ప్రస్తుతం లేదని సీఎం సిద్ధరామయ్య స్పష్టం చేశారు. ఈ విషయం తాజాగా Read more

తిరుపతి తొక్కిసలాట..ప్రధాని, రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి
Tirupati stampede..Prime Minister, Revanth Reddy shocked

తిరుమల: తిరుమల వైకుంఠ ద్వార దర్శనం ఫ్రీ టోకెన్ల కోసం జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు మృతి చెందగా.. మరో 60 మందికి గాయాలయ్యాయి. వారందర్నీ తిరుపతిలోని Read more