ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా ఆతిషీ ..కేజ్రీవాల్‌ వెల్లడి

Atishi Kejriwal announced as the new Chief Minister of Delhi

న్యూఢిల్లీ: ఢిల్లీ నూతన ముఖ్యమంత్రిగా ఆతిషీ ఎన్నికయ్యారు. ఆప్ ఎమ్మెల్యేలు ఆమెను సీఎంగా ఎన్నుకున్నారు. అతిషి పేరును పార్టీ అధినేత కేజ్రీవాల్ ప్రతిపాదించగా ఎమ్మెల్యేలు తమ మద్దతు తెలిపారు. ఈ మేరకు శాసనసభా పక్షం ఆమోద ముద్ర లభించింది.

కాగా ఇవాళ సాయంత్రం ముఖ్యమంత్రి పదవికి కేజ్రీవాల్ రాజీనామా చేయనున్నారు. సాయంత్రం 4 గంటలకు ఆయన లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాను కలవనున్నారు. ఈ భేటీలో రాజీనామా లేఖను అందజేయనున్నారు.