ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరు

ఢిల్లీ మద్యం కేసులో జైల్లో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నేషనల్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌కు బెయిల్ లభించింది. రూ.1 లక్ష పూచీకత్తుతో కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు చేస్తున్నట్లు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు తాజాగా తీర్పును ఇచ్చింది.

కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ పై రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరిగింది. కేజ్రీవాల్ పిటిషన్ రౌస్ అవెన్యూ కోర్టు వెకేషన్ బెంచ్ ముందు విచారణకు వచ్చింది. వాదనలు విన్న అనంతరం తీర్పును రిజర్వ్ చేశారు. తాజాగా, వెకేషన్ బెంచ్ న్యాయమూర్తి న్యాయ్ బిందు తీర్పును వెలువరించారు. రేపు ఆయన జైలు నుంచి విడుదల కానున్నారు.