కవిత బెయిల్‌ పిటిషన్‌ పై సుప్రీంకోర్టులో కొనసాగుతున్న వాదనలు

Arguments on Kavitha’s Bail Petition in the Supreme Court

న్యూఢిల్లీ: బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత బెయిల్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతుంది. జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌, జస్టిస్‌ విశ్వనాథన్‌ ధర్మాసనం విచారణ చేపట్టగా.. కవిత తరఫున ప్రముఖ న్యాయవాది ముకుల్‌ రోహత్గీ వాదనలు వినిపించారు. కవితకు బెయిల్‌ పొందే అర్హత ఉందని తెలిపారు. కవిత బెయిల్‌ పిటిషన్‌పై వాదనలు ముగిశాయని రోహత్గీ తెలిపారు. ఈడీ, సీబీఐ కేసులో ఇప్పటికే విచారణ పూర్తయ్యిందని న్యాయవాది ముకుల్‌ రోహత్గీ తెలిపారు. ఈడీ కేసులో 5 నెలలుగా కవిత జైల్లో ఉన్నారని అన్నారు. సీబీఐ కేసులో 4 నెలలుగా జైలులో ఉన్నారని చెప్పారు. ఈ కేసులో మొత్తం 493 మంది సాక్షుల విచారణ ముగిసిందని అన్నారు. కేసులో ఛార్జ్‌షీట్లు కూడా దాఖలు చేశారని తెలిపారు.

కవిత దేశం విడిచి పారిపోయే అవకాశం లేదని రోహత్గీ అన్నారు. కవితకు బెయిల్‌ పొందే అర్హత ఉందని తెలిపారు. రూ.100 కోట్లు చేతులు మారినట్లు ఆరోపణలు మాత్రమే అని అన్నారు. దర్యాప్తు సంస్థలు అడిగిన ఫోన్లను కవిత ఇచ్చారని చెప్పారు. ఫోన్లు మార్చడంలో తప్పేముందని ప్రశ్నించారు. సౌత్‌ గ్రూప్‌ 100 కోట్లు అంటున్నారని.. కానీ దాన్ని రికవరీ చేయలేదని తెలిపారు. 493 మంది సాక్షులను విచారించారని అన్నారు. సాక్షులను బెదిరించారని చెబుతున్నారని.. కానీ ఎక్కడా ఎందుకు కేసులు నమోదు కాలేదని ప్రశ్నించారు. కవిత ఎవరినీ బెదిరించలేదని స్పష్టం చేశారు.విచారణలో తీవ్ర ఆలస్యం జరుగుతుందని అన్నారు. సిసోడియాకు ఇచ్చిన బెయిల్ అంశాలే కవితకు వర్తిస్తాయని తెలిపారు.