Are there Telugu people in all these countries?: Chandrababu

ఇన్ని దేశాల్లో తెలుగు వారు ఉన్నారా..?: చంద్రబాబు

జ్యూరిచ్ : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు దావోస్‌లో వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సుకు హాజరయ్యేందుకు జ్యూరిచ్‌ చేరుకున్నారు. ఈ క్రమంలోనే స్విట్జర్లాండ్ లోని జ్యూరిచ్ లో పారిశ్రామిక వేత్తలతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలుగు వాళ్లు ఎక్కడైనా గొప్పగా పని చేస్తారు.. రాణిస్తారు. అన్ని దేశాల్లో తెలుగు వారి ప్రింట్ ఉంటుంది. అదే మన గొప్పతనం అని తెలిపారు. ఇన్ని దేశాల్లో తెలుగు వారు ఉన్నారా..? అని ఆశ్చర్యపోయానని తెలిపారు. ఏ దేశమైనా యువత వల్లే అభివృద్ధి చెందుతుందన్నారు.

image

చదువులో ఆడపిల్లపై వివక్ష చూపించవద్దని ఆనాడే చెప్పాను. పురుషుల కంటే మహిళలే తెలివైన వారని నిరూపితమైంది. ప్రస్తుతం యువకుల కంటే యువతులే ఎక్కువగా అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. ఆ రోజుల్లో ఐటీకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చా. హైదరాబాద్ లో భూములు అమ్ముకోవద్దని చాలా మందికి చెప్పాను. హైదరాబాద్ లో భూములకు అధిక ధర వస్తుందని ఆనాడే చెప్పా. తెలంగాణ తలసరి ఆదాయం హైదరాబాద్ సంపదే కారణం అని సిఎం చంద్రబాబు తెలిపారు. మరోజన్మ ఉంటే తెలుగు వారిగా పుట్టించాలని దేవుడిని కోరుకుంటున్నానని తెలిపారు.

తాను జైలులో ఉన్నప్పుడు మీరంతా మద్దతు ఇచ్చారని గుర్తుచేశారు. చాలా దేశాల్లో ఉన్న తెలుగువారు నిరసన తెలిపారని చెప్పారు. కూటమి గెలుపులో ఎన్‌ఆర్‌ఐల పాత్ర ఎంతో ఉందని సీఎం చంద్రబాబు తెలిపారు. ఏపీ ఫార్మా రంగంలో పెట్టుబడులకు సహకరించాలని.. స్విస్‌ రాయబారి మృదుల్‌ కుమార్‌ను చంద్రబాబు బృందం కోరారు. కాసేపట్లో తెలుగు కమ్యూనిటీతో చంద్రబాబు ‘మీట్‌ అండ్‌ గ్రీట్‌’ నిర్వహించనున్నారు. అనంతరం జ్యూరిచ్‌ నుంచి దావోస్‌కు సీఎం చంద్రబాబు వెళ్లనున్నారు.

Related Posts
ఎక్స్పీరియం పార్క్ అద్భుతమైన కళాఖండం – చిరంజీవి
Chiranjeevi Experium Eco Pa

ఎక్స్‌పీరియం పార్క్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా పాల్గొని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి ఈ పార్కును ప్రారంభించారు. ఈ సందర్భంగా చిరంజీవి Read more

అప్రమత్తంగా ఉండండి..సహజ వాయువు పైప్‌లైన్‌ల తవ్వకం మరియు నాశనం చేసిన యెడల చట్టపరమైన చర్యలు..
Be alert.Legal action in case of excavation and destruction of natural gas pipelines

హిందూపూర్: హిందూపూర్ లో హౌసింగ్ బోర్డ్ కాలనీకి సమీపంలో, సాయిబాబా మందిరం వెనుక వైపు, ఏజి & పి ప్రథమ్ సంస్థ (AG&P Pratham) ద్వారా వేయబడిన Read more

AI విశ్వవిద్యాలయం ఏర్పాటుకు టాస్క్‌ఫోర్స్‌: మహారాష్ట్ర
ashish shelar

దేశంలోని మొట్టమొదటి AI విశ్వవిద్యాలయం ప్రణాళిక అమలు కోసం మహారాష్ట్ర ఒక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. ఈ విశ్వవిద్యాలయం AI సంబంధిత రంగాలలో పరిశోధన, అభివృద్ధిని ప్రోత్సహిస్తుందని Read more

ఏపీలో రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచేందుకు ప్రభుత్వం సిద్ధం
ap land registration

ఏపీలో రిజిస్ట్రేషన్ చార్జీల పెంపు విషయం ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై తాడేపల్లి ఐజీ కార్యాలయంలో దేవాదాయ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ రిజిస్ట్రేషన్ మరియు స్టాంపుల Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *