kumbh mela 2025

నిధులన్నీ కుంభమేళాకేనా..? మమత బెనర్జీ

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఉత్తరప్రదేశ్‌లో జరిగే కుంభమేళాకు వేల కోట్ల నిధులను కేటాయిస్తున్న NDA ప్రభుత్వం, బెంగాల్‌లో జరగే గంగాసాగర్ మేళాకు మాత్రం ఎందుకు నిధులు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. గంగాసాగర్ మేళా కూడా ఎంతో ప్రాముఖ్యమున్న పుణ్యక్షేత్రమని, దీనికి సరైన మౌలిక సదుపాయాలు అవసరమని ఆమె పేర్కొన్నారు.

గంగాసాగర్ మేళా గంగానది, బంగాళాఖాతం కలిసే ప్రదేశంలో ప్రతి ఏటా సంక్రాంతి సందర్భంగా నిర్వహించబడుతుంది. ఈ పుణ్యస్నానం కోసం లక్షలాది మంది భక్తులు ఇక్కడికి చేరుకుంటారు. అయితే, ఈ ప్రదేశానికి సరైన రవాణా సౌకర్యాలు లేవని, ముఖ్యంగా నీటిమార్గం ద్వారా ప్రయాణం మరింత సౌకర్యవంతమవుతుందని మమతా బెనర్జీ చెప్పారు.

ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఇక్కడ బ్రిడ్జి నిర్మాణానికి ఆర్థిక సహాయం చేయకపోవడం ఆవేదన కలిగిస్తోందని ఆమె అన్నారు. గంగాసాగర్‌ ప్రాంత అభివృద్ధి పట్ల కేంద్రం నిర్లక్ష్యంగా ఉందని, తాము స్వయంగా తమ ప్రభుత్వ నిధులతోనే బ్రిడ్జి నిర్మాణం చేపడుతున్నామని మమత తెలిపారు. ఇది భక్తులకు ప్రయాణాన్ని సులభతరం చేస్తుందని పేర్కొన్నారు.

కుంభమేళాకు కేంద్రం వేల కోట్ల నిధులు కేటాయిస్తే, గంగాసాగర్ మేళాకు కనీసం ప్రాథమిక సదుపాయాలు అందించకపోవడం అన్యాయం అన్నారు. గంగాసాగర్ మేళా కూడా దేశానికే గర్వకారణమైన ఆధ్యాత్మిక పండుగ అని, దీనికి కేంద్రం సముచిత ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు.

Related Posts
ఆరిలోవ లో నూతన పోలీస్ భవనాన్ని ప్రారంభించిన హోం మంత్రి అనిత
Home Minister Anitha inaugu

ఆరిలోవ హనుమంతువాక వద్ద ఎకరం స్థలంలో 17 గదులతో విశాలముగా నిర్మించిన ఆరిలోవ పోలీస్ స్టేషన్ నూతన భవనాన్ని ఆదివారం రాష్ట్ర హోం శాఖ మంత్రివర్యులు వంగలపూడి Read more

ఢిల్లీ ఎయిమ్స్ లో రోగులను పరామర్శించిన రాహుల్
Rahul Gandhi reached Delhi

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అర్ధరాత్రి ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రిని పర్యటించారు. ఈ సందర్బంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులతో ఆయన మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. Read more

2026 నాటికి నక్సలిజాన్ని నిర్ములించాల్సిందే : అమిత్‌ షా ప్రకటన
Amit Shah is going to visit AP

న్యూఢిల్లీ: కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2026 నాటికి నక్సలిజాన్ని నిర్ములించాల్సిందేనని Read more

అమెరికాలో ఎవరెవరిని బహిష్కరిస్తున్నారు?
అమెరికాలో ఎవరెవరిని బహిష్కరిస్తున్నారు?

అమెరికాలో 'చట్టవిరుద్ధంగా' నివసిస్తున్న 104 మంది భారతీయులను ఆ దేశం ఇటీవలే వెనక్కు పంపించింది. ఇందులో గుజరాత్, హరియాణా, పంజాబ్‌లకు చెందిన వారు ఎక్కువగా ఉన్నారు. డోనల్డ్ Read more