Application deadline extension for liquor shops in AP

ఏపీలో మద్యం షాపుల దరఖాస్తుల గడువు పొడిగింపు

అమరావతి: కొత్త మ‌ద్యం పాల‌సీని తీసుకొచ్చిన ఏపీలోని కూట‌మి ప్ర‌భుత్వం కొత్త‌ మ‌ద్యం దుకాణాల కోసం ద‌ర‌ఖాస్తులు స్వీక‌రిస్తున్న విష‌యం తెలిసిందే. అయితే, మ‌ద్యం షాపులు ద‌క్కించుకోవాల‌నుకునే ఆశావ‌హుల‌కు ప్ర‌భుత్వం తీపి క‌బురు చెప్పింది. కొత్త మ‌ద్యం దుకాణాల ద‌ర‌ఖాస్తు గ‌డువును పొడిగించింది. ఈ మేర‌కు ఇవాళ ఉత్త‌ర్వులు జారీ చేసింది.

టెండ‌ర్ల షెడ్యూల్ మార్పు కొరుతూ వివిధ జిల్లాల్లో ఉన్న ద‌ర‌ఖాస్తుదారుల నుంచి భారీ ఎత్తున్న అభ్య‌ర్థ‌న‌లు రావ‌డంతో ఎక్సైజ్ అధికారులు ఈ విష‌యాన్ని ప్ర‌భుత్వం దృష్టికి తీసుకెళ్ల‌డం జ‌రిగింది. దీంతో స‌ర్కార్ షెడ్యూల్‌ను మార్చింది.

ఈ నెల 11 సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు ద‌రఖాస్తులు స్వీక‌రిస్తామ‌ని ప్ర‌క‌టించింది. అలాగే 14న మ‌ద్యం షాపుల‌కు లాట‌రీ విధానంలో డ్రా తీసి, 16 నుంచి ద‌ర‌ఖాస్తుదారుల‌కు దుకాణాల‌ను కేటాయించ‌డం జ‌రుగుతుంద‌ని పేర్కొంది.

ఇదిలాఉంటే.. ఇప్ప‌టివ‌ర‌కు రాష్ట్ర వ్యాప్తంగా 3,396 మ‌ద్యం దుకాణాల‌కు గాను మంగ‌ళ‌వారం రాత్రి వ‌ర‌కు 41,348 ద‌ర‌ఖాస్తు వ‌చ్చిన‌ట్లు అధికారులు తెలిపారు. త‌ద్వారా ప్ర‌భుత్వ ఖ‌జానాకు రూ.826.96కోట్ల ఆదాయం వ‌చ్చి చేరిన‌ట్లు స‌మాచారం. కాగా, ఒక్కొ ద‌ర‌ఖాస్తుకు నాన్‌-రిఫండ‌బుల్ కింద రూ.2ల‌క్ష‌లు క‌ట్టాల్సి ఉన్న విష‌యం తెలిసిందే.

Related Posts
50% రాయితీపై పెట్రోల్..ఏపీ సర్కార్ గుడ్ న్యూస్
Petrol on 50% discount AP

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వయం ఉపాధి పొందుతున్న లేదా ప్రైవేట్ జాబ్ చేస్తున్న దివ్యాంగులకు 50% సబ్సిడీపై పెట్రోల్ మరియు డీజిల్ అందించనున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం దివ్యాంగుల Read more

టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
vaa

అమరావతి : ఏపీలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాలలో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమైంది. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో, టీడీపీ అధినేత మరియు ముఖ్యమంత్రి చంద్రబాబు Read more

తెలంగాణ లో మందుబాబులకు కిక్కు పెంచే న్యూస్
kicks drug addicts in Telan

తెలంగాణలో మద్యం ధరలను పెంచేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదని అధికార వర్గాలు వెల్లడించాయి. ఉత్పత్తిదారులు, సరఫరాదారులు ధరల పెంపుపై ప్రతిపాదనలు చేసినప్పటికీ, ప్రభుత్వం వాటిని అంగీకరించలేదు. సాధారణంగా, Read more

చేనేత కార్మికులకు గుడ్ న్యూస్
chenetha workers good news

తెలంగాణ ప్రభుత్వం చేనేత కార్మికుల కోసం మరో సంక్షేమ పథకాన్ని ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. ‘వర్కర్ టు ఓనర్’ పథకం ద్వారా నేత కార్మికులను స్వయంసంపన్నులుగా మార్చే ప్రణాళికను Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *