ఎంపిహెచ్ఎల తొలగింపుపై

CM Revanth : తెలంగాణ సీఎం పై ఏపీ మంత్రి ఆగ్రహం

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ మంత్రి సత్యకుమార్ యాదవ్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. నరేంద్ర మోదీని గాడ్సేతో పోల్చిన రేవంత్ వ్యాఖ్యలను ఆయన ఖండించారు. రేవంత్ రెడ్డి అసమర్థ ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారని, తన చేతకానితనాన్ని దాచిపెట్టేందుకు కేంద్ర నేతలపై విమర్శలకు దిగుతున్నారని మండిపడ్డారు. ఈ స్థాయి నేతగా ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం రాజ్యాంగ పద్ధతులకు, ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని వ్యాఖ్యానించారు.

Advertisements
Telangana: మంత్రివర్గ విస్తరణ తుది కసరత్తు పూర్తి!

రేవంత్ మాటల వెనుక ఉద్దేశం ఏమిటి?

సత్యకుమార్ ప్రకారం, రేవంత్ రెడ్డి ఎన్నికల హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. ప్రజల్లో తాను పట్టు కోల్పోతున్న పరిస్థితిలో, వాటి నుంచి దృష్టిని మళ్లించేందుకు మోదీపై విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. పదవి కాపాడుకోవడం కోసం అర్థం లేని, తీవ్రతరమైన వ్యాఖ్యలు చేస్తూ ప్రజల భావోద్వేగాలతో ఆడుకుంటున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి పదవిలో ఉండే వ్యక్తి తగిన బాధ్యతను చూపించాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు.

రేవంత్‌కి గాంధీ కుటుంబం మద్దతు అంతేనా?

బీజేపీని అడ్డుకోవడం నెహ్రూ, ఇందిరా, రాజీవ్, సోనియా, రాహుల్ గాంధీ లాంటి శక్తివంతమైన నాయకులకు సాధ్యపడలేదని, అలాంటప్పుడు గాంధీ కుటుంబ మద్దతుతో ఎదిగిన రేవంత్ రెడ్డి ఏం చేయగలడని సత్యకుమార్ ఎద్దేవా చేశారు. రేవంత్ గాంధీ కుటుంబానికి మోచేతి నీళ్లు తాగే స్థాయికి పరిమితమయ్యాడని, అటువంటి వ్యక్తి దేశ ప్రధానిపై విమర్శలు చేయడం హాస్యాస్పదమని పేర్కొన్నారు. రాజకీయ వ్యూహాలకు మించిన ప్రజల విశ్వాసం కీలకమని, రేవంత్ రెడ్డి ఆ విశ్వాసాన్ని కోల్పోతున్నారని పేర్కొన్నారు.

Related Posts
vidadala rajini: విడదల రజనిపై ఎంపీ కృష్ణదేవరాయలు సంచలన వ్యాఖ్యలు
విడదల రజనిపై ఎంపీ కృష్ణదేవరాయలు సంచలన వ్యాఖ్యలు

స్టోన్ క్రషర్ యజమాని నుంచి అక్రమ వసూళ్లకు పాల్పడ్డారంటూ మాజీ మంత్రి, వైసీపీ నాయకురాలు విడదల రజనిపై సీఐడీ కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసుపై Read more

అందరికి రుణమాఫీ చేసి తీరుతాం – పొంగులేటి
runamafi ponguleti

అర్హులైన రైతులకు రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. గత ప్రభుత్వం గడిచిన పదేళ్లలో రూ.13,500 కోట్లు రెండు విడతలుగా మాఫీ Read more

కోమాలో ఉన్న నీలం షిండే కుటుంబానికి అత్యవసర వీసా మంజూరు
కోమాలో ఉన్న నీలం షిండే కుటుంబానికి అత్యవసర వీసా మంజూరు

కాలిఫోర్నియాలో రోడ్డు ప్రమాదానికి గురైన భారత విద్యార్థి నీలం షిండే ప్రస్తుతం కోమాలో ఉంది.ఆమె కుటుంబానికి అత్యవసర వీసా మంజూరు చేసి అమెరికా వెళ్లే అవకాశం కల్పించారు. Read more

ఈ బడ్జెట్‌ వికసిత్‌ భారత్‌కు ఊతం ఇస్తుంది: ప్రధాని
Prime Minister Modi speech in the Parliament premises

న్యూఢిల్లీ : ఈరోజు నుండి కేంద్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ బడ్జెట్‌పై దేశ వ్యాప్తంగా ప్రజలు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. తొలిరోజు సమావేశాల్లో Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×